యాప్నగరం

పాక్‌కు షాకిచ్చిన తాలిబన్.. కశ్మీర్ అంశంపై కీలక ప్రకటన

Kashmir జిహాదీలో తాలిబన్ చేరిపోతుందంటూ వార్తలు వస్తున్న వేళ ఆ సంస్థ రాజకీయ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. ఒక రకంగా పాకిస్థాన్‌ను ఇరుకున పెట్టే విధంగా స్పందించారు.

Samayam Telugu 19 May 2020, 9:57 pm
శ్మీర్ జీహాదీలో తాలిబన్ చేరిపోతుందంటూ వస్తున్న వార్తలపై ఆ సంస్థ స్పందించింది. కశ్మీర్ అంశం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం తమ విధానం కాదని స్పష్టం చేసింది. ఇటీవల తాలిబన్‌ రాజకీయ విభాగంగా ప్రకటించుకున్న ‘ఇస్లామిక్‌ ఎమిరేట్స్ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌’ మీడియా ప్రతినిధి సుహైల్‌ షాహీన్ సోమవారం (మే 18) సాయంత్రం ట్విటర్ ద్వారా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu కశ్మీర్ లోయ
Kashmir Valley


‘కశ్మీర్ జీహాద్‌లో తాలిబన్ చేరిపోతుందంటూ మీడియాలో ప్రచురించిన ప్రకటన పూర్తిగా తప్పు. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనేది ఇస్లామిక్ అమిరాత్ స్పష్టమైన విధానం’ అని సుహైల్ షహీన్ పేర్కొన్నారు. ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. కశ్మీర్ అంశంలో తాలిబన్ జోక్యం చేసుకుంటుందని భావిస్తున్న పాకిస్థాన్‌కు ఒక రకంగా ఇది చెంపపెట్టు లాంటి ప్రకటనే.

తాలిబన్ ప్రతినిధిగా చెప్పుకునే జబీవుల్లా ముజాహిద్ పేరుతో ఇటీవల వచ్చిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా భారత్‌తో స్నేహం అసాధ్యమని.. కాబూల్‌లో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత కశ్మీర్‌ను కాఫిర్ల నుంచి విముక్తం చేస్తామని ఆ ప్రకటన సారాంశం. ఇదే వార్త అటు మీడియాలోనూ ప్రముఖంగా ప్రచురితమైంది.

భారత్ ఈ ప్రకటన విశ్వసనీయతపై కాబూల్, ఢిల్లీలోని దౌత్యవర్గాలను సంప్రదించింది. ఆ సంప్రదింపుల ఫలితంగానే అమిరాత్ వివరణ వెలువడిందని దౌత్యవర్గాలు పేర్కొంటున్నాయి. అఫ్గానిస్థాన్‌లో రాజకీయ సుస్థిరత్వం కోసం భారత్ మధ్యవర్తిత్వం వహించాలని ఇటీవల అమెరికా కోరిన విషయం తెలిసిందే. భారత్ చొరవతో అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొంటుందని అగ్రరాజ్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ పరిణామం అనంతరం కశ్మీర్ అంశంపై తాలిబన్ ప్రకటన అంశం తెరపైకి రావడం గమనార్హం.

Also Read: కాళేశ్వరం సహా గోదావరి ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు.. జల జగడం తారాస్థాయికి

Must Read: అత్యాచార బాధితురాలి గర్భం తొలగింపు.. హైకోర్టు కీలక తీర్పు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.