యాప్నగరం

కశ్మీరీ ప్రజలు తాము భారతీయులమని భావించడంలేదు.. ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో నిర్బంధం కొనసాగుతోందని, ప్రజలకు స్వేచ్ఛ కరువైందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 24 Sep 2020, 11:07 am
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కశ్మీరీలు భారతీయులమని భావించడంలేదు.. భారతీయులుగా ఉండాలని కోరుకోవడంలేదని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజల మనోగతంపై యాంకర్, జర్నలిస్ట్ కరన్ థాపర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే, కశ్మీర్‌లో భారతీయుడు అని పిలిచే వ్యక్తిని కనుగొంటే ఆశ్చర్యపోతున్నాను ... కావాలంటే మీరు వెళ్లి తెలుసుకుని వారితో మాట్లాడండి.. తాము పాకిస్థానీలమని చెప్పరు, కానీ, ఇదే సమయంలో భారతీయులమనే భావన లేదు.. ఇలా ఉంటే మనం బతకగలమా అనే ఆందోళన కలుగుతుంది అని అన్నారు.
Samayam Telugu ఫరూక్ అబ్దుల్లా
Former Jammu & Kashmir chief minister Farooq Abdullah


కశ్మీరీలు ప్రభుత్వాన్ని ఇకపై నమ్మరు... ఇది లోయలోని ప్రజల మనోగతం.. దేశ విభజన సమయంలో పాక్ వెంట వెళ్లడం కశ్మీరీలకు చాలా సులభం కానీ, గాంధీ భారతదేశంలో చేరారు, మోడీ భారత్‌లో కాదు అని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత నిర్బంధంలో ఉన్న ఫరూక్ అబ్దుల్లా ఇటీవలే విడుదలయ్యారు. అయితే, ఫరూక్, మొహబూబా ముఫ్తీలు లోయలో గందరగోళంపై ఆధారపడతారు.

‘మరోవైపు చైనా ముందుకు సాగుతోంది.. కశ్మీరీలతో మాట్లాడితే వారిలోని చైనీయులు బయటపడతారు.. ఏది ఏమైనప్పటికీ తమ ప్రాంతంలోని ముస్లింలకు చైనీయులు ఏమి చేశారో తెలుసు.. దీనిని తీవ్రంగా పరిగణించను.. కానీ ఈ విషయంలో నిజాయితీగా ఉన్నాను. ప్రజలు వినడానికి ఇష్టపడని వాటిని నేను నిజాయితీగా మీకు చెబుతున్నాను. పాకిస్థాన్‌ వెంట వెళ్లేందుకు ఇష్టపడటంలేదు’ అని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.