చిన్నారి కావేరి మరణం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. వారి కన్నా కూడా కావేరి నేస్తం తన స్నేహితురాలి లేదన్న బాధని అస్సలు తట్టుకోలేక పోతోంది. అందుకే చిన్నారి సమాధి చుట్టే తిరుగుతోంది. ఆ నేస్తం ఎవరో కాదు ఓ శునకం.... దానికి కావేరి ‘చిన్నూ’ అని నామకరణం చేసింది. కర్ణాటకలోని బెళగావి జిల్లా జుంజుర్ వాడిలో ఆరేళ్ల కావేరీ బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటూ 30 అడుగల లోతునే ఉండిపోయి మరణించింది. అధికారులు అతి కష్టమ్మీద ఆమె మృతదేహాన్ని బయటికి తీశారు.
అనంతరం గ్రామసమీపంలోనే ఖననం చేశారు. చిన్నారి పెంచుకున్న కుక్క మాత్రం ఎడబాటును భరించలేక బెంగపెట్టుకుంది. ఖననం చేసిన చోటనే కాళ్లతో తవ్వడం, చుట్టూ తిరగడం చేస్తోంది. ఖననం చేసిన రోజు నుంచి అక్కడే ఉంటోంది. నీళ్లు, ఆహారం కూడా ముట్టుకోవడం లేదు. ఆ శునకాన్ని చూసిన కుటుంబం, గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు. కావేరి బోరు బావిలో పడిన రోజు నుంచి అక్కడే తిరుగుతూ ఉంది. ఏడాదిగా కావేరీ చిన్నూను పెంచుతున్నట్టు కుటుంబీకులు తెలిపారు.
అనంతరం గ్రామసమీపంలోనే ఖననం చేశారు. చిన్నారి పెంచుకున్న కుక్క మాత్రం ఎడబాటును భరించలేక బెంగపెట్టుకుంది. ఖననం చేసిన చోటనే కాళ్లతో తవ్వడం, చుట్టూ తిరగడం చేస్తోంది. ఖననం చేసిన రోజు నుంచి అక్కడే ఉంటోంది. నీళ్లు, ఆహారం కూడా ముట్టుకోవడం లేదు. ఆ శునకాన్ని చూసిన కుటుంబం, గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు. కావేరి బోరు బావిలో పడిన రోజు నుంచి అక్కడే తిరుగుతూ ఉంది. ఏడాదిగా కావేరీ చిన్నూను పెంచుతున్నట్టు కుటుంబీకులు తెలిపారు.