ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేసీ ఘన విజయం సాధించినందుకుగాను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. ‘ప్రధాని మోడీ మరింత సమర్థంగా ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్లాలి. సరికొత్త ఉత్సాహంతో పనిచేయడానికి ఈ విజయం స్ఫూర్తినిస్తుంది. మోడీని బలపరుస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారు’ అని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేసీ తిరుగులేని విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో 403 స్థానాలకు.. ఇప్పటికే 320 చోట్ల గెలుపొందింది. మరికొన్ని స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి 55, బీఎస్పీకి 18, ఇతరులకు 5 స్థానాల్లో విజయం దక్కింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో ఆ పార్టీకి 56 దక్కాయి. కాంగ్రెస్ 11, ఇతరులు 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. కాగా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 117 స్థానాలున్న పంజాబ్లో కాంగ్రెస్కు ఇప్పటికే 75 స్థానాలు దక్కాయి.
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేసీ తిరుగులేని విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో 403 స్థానాలకు.. ఇప్పటికే 320 చోట్ల గెలుపొందింది. మరికొన్ని స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి 55, బీఎస్పీకి 18, ఇతరులకు 5 స్థానాల్లో విజయం దక్కింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. రాష్ట్రంలోని 70 స్థానాల్లో ఆ పార్టీకి 56 దక్కాయి. కాంగ్రెస్ 11, ఇతరులు 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. కాగా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 117 స్థానాలున్న పంజాబ్లో కాంగ్రెస్కు ఇప్పటికే 75 స్థానాలు దక్కాయి.