యాప్నగరం

Onam Lottery లాటరీ గెలిచాక మనశ్శాంతి కరువయ్యింది.. వాపోతున్న కేరళ ఆటోవాలా.. ఏం జరిగింది?

అప్పుల్లో నిండా మునిగిపోయి ఉపాధి కోసం మలేషియా వెళ్లేందుకు సిద్ధమైన కేరళ ఆటో డ్రైవర్ అనూప్‌ను అదృష్టం వరించింది. విదేశాలకు వెళ్లేడానికి ఏర్పాట్లు చేసుకుంటూ లోన్ కోసం బ్యాంకులో దరఖాస్తు చేసిన మరుసటి రోజే ఓనమ్‌ బంపర్‌ లాటరీలో అతడికి ఏకంగా రూ.25 కోట్ల గెలుచుకున్నాడు. దీంతో అతడి జీవితమే పూర్తిగా మారిపోయింది. కానీ, తనకు లాటరీ గెలిచిన సంతోషం కంటే మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన చెప్పడం గమనార్హం.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 26 Sep 2022, 3:09 pm

ప్రధానాంశాలు:

  • ఓనమ్ లాటరీలో రూ.25 కోట్ల గెలిచిన ఆటో డ్రైవర్
  • సాయం చేయమంటూ క్యూ కడుతోన్న జనాలు
  • వేరే ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్న అనూప్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కేరళ ఆటోడ్రైవర్ అనూప్
నిన్న మొన్నటి వరకూ ఆర్థిక కష్టాలు వెంటాడంతో ఉపాధి కోసం దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైన కేరళ ఆటో డ్రైవర్ (Kerala Auto Driver).. ఓనమ్ బంపర్ లాటరీ (Onam Bumper Lottery) తగలడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇక తన కష్టాలు తీరిపోతాయని, హాయిగా ఉండొచ్చని సంబరపడిపోయిన అతడికి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా సాయం చేయాలంటూ జనాలు వెంటబడుతున్నారు. తాను సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదని, లాటరీ తగిలిందన్న విషయం తెలియగానే అందరూ వాలిపోతున్నారని వ్యాఖ్యానించాడు. కేరళ ఓనమ్ బంపర్ లాటరీ (Kerala Onam Bumper Lottery) గెలిచినా తనకు సంతోషం లేకుండాపోయిందని ఆటోవాలా అనూప్ (Autowala Anup) వాపోతున్నాడు.
మొత్తం రూ.25 కోట్ల లాటరీలో పన్నులు, ఏజెంట్ కమిషన్ పోనూ అనూప్ చేతికి రూ.15.75 కోట్ల అందుతాయి. ఈ విషయం తెలియగానే తమకు సాయం చేయాలంటూ తిరువనంతపురంలోని ఆయన ఇంటికి జనం క్యూ కడుతున్నారు. ‘‘ఇంట్లో మేం బందీలుగా ఉన్నట్టుంది.. బయటకు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఎక్కడికి పోయినా జనం చుట్టుముడుతున్నారు. నా కొడుక్కి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేకపోతున్నాం’’ అని అనూప్‌ వాపోయారు.

తన ఇంటికి జనాలు క్యూ కడుతుండటంతో విసిగిపోయిన అనూ ప్.. వారి నుంచి తప్పించుకోడానికి తన సోదరి ఇంట్లో, ఇతర ప్రదేశాలలో ఉంటున్నాడు. లాటరీ గెలుచుకున్నందుకు సహజంగానే థ్రిల్ అయ్యానని, అయితే ఇప్పుడు తనకు మనశ్శాంతి లేకుండా పోయిందన్నాడు. అంతేకాదు, ఇంకా లాటరీ సొమ్ము తన చేతికి అందలేదని, ఈ విషయం చెబుతున్నా ఎవ్వరూ నమ్మడం లేదని పేర్కొన్నాడు. ‘ఇప్పటి వరకూ లాటరీ డబ్బులు రాలేదు.. దయచేసిన అర్ధం చేసుకోండి’ అని వేడుకుంటున్నాడు.

లాటరీ సొమ్ముతో మంచి ఇల్లు కట్టుకుని, మొత్తం అప్పులను తీర్చేస్తానని అనూప్ తెలిపాడు. అంతేకాదు, తన బంధువులకు కొంత సాయం చేస్తానని.. కొన్ని ఛారిటీ పనులు చేస్తానని వివరించాడు. అలాగే, ఏదైనా హోటల్‌ని ప్రారంభించి వ్యాపారం చేస్తాననని పేర్కొన్నాడు. ఇకపై కూడా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూనే ఉంటానని చెప్పడం గమనార్హం.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.