యాప్నగరం

బీజేపి కార్యకర్త దారుణ హత్య: త్రిచూర్‌లో బంద్‌కి పిలుపునిచ్చిన బీజేపీ

కొక్కులంగరలో జరుగుతున్న ఉత్సవాల్లో ఆదివారం అర్ధరాత్రి ఓ బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురవడం కలకలం..

TNN 13 Feb 2017, 8:35 am
కేరళలోని త్రిచూర్‌కి సమీపంలో వున్న కొక్కులంగరలో జరుగుతున్న ఉత్సవాల్లో ఆదివారం అర్ధరాత్రి ఓ బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురవడం కలకలం రేపింది. హత్యకు గురైన యువకుడిని నెట్టిచెరీకి చెందిన నిర్మల్ (20)గా గుర్తించారు. ఇదే దాడిలో తీవ్రంగా గాయపడిన థామస్ (29) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిర్మల్‌ని హత్య చేసింది సీపీఎం కార్యకర్తలే అని ఆరోపిస్తూ బీజేపీ ఇవాళ త్రిచూర్‌లో బంద్‌కి పిలుపునిచ్చింది.
Samayam Telugu kerala bjp has called a hartal in thrissur today
బీజేపి కార్యకర్త దారుణ హత్య: త్రిచూర్‌లో బంద్‌కి పిలుపునిచ్చిన బీజేపీ


రాజకీయ కక్షల నేపథ్యం వున్న త్రిచూర్‌లో మరో హత్య వెలుగుచూడటం స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తోంది. గత జనవరి 18న కూడా ఇజుతన్ సంతోష్ అనే బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ధర్మదమ్‌కి చెందిన సీపీఎం కార్యకర్తలే సంతోష్‌‌ని హత్య చేశారు అని అందిన ఫిర్యాదు మేరకు జనవరి 20న పోలీసులు ఐదుగురు సీపీఎం కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.