కేరళలోని కోజికోడ్ తీవ్ర విషాదం నింపిన విమాన ప్రమాదం.. కరోనా అలజడికి కారణమవుతోంది. ప్రమాదం తర్వాత రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అధికారులకు వరుసగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారుల్లో 22 మందికి ఇప్పటికే పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. ఈ జాబితాలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారుల్లోనూ పలువురు కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం వెంట జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. అధికారులకు కరోనా సోకిన విషయం తెలియగానే సీఎం విజయన్తో పాటు పలువురు అధికారులు హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి విజయన్తో పాటు ఆయన వెంట ఉన్న అధికారులు క్వారంటైన్లో ఉంటారని సీఎం కార్యాలయం శుక్రవారం (ఆగస్టు 14) తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార, దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ జాతీయ జెండాను ఎగురవేస్తారని పేర్కొంది.
వందేభారత్ మిషన్లో భాగంగా ఆగస్టు 7న 190 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం.. కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పైనుంచి జారిపోయి 35 అడుగుల లోయలో పడిపోయింది. మరికొద్ది క్షణాల్లో స్వదేశంలో అడుగు పెట్టబోతున్నామనే ప్రయాణికుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ సహా మొత్తం 18 మంది మరణించారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల్లో పలువురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
Must Read: అంత లోతులోకి జారిపోయిన విమానం.. మంటలు చెలరేగి ఉంటే!
ప్రమాద స్థలాన్ని సందర్శించిన అధికారుల్లోనూ పలువురు కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం వెంట జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. అధికారులకు కరోనా సోకిన విషయం తెలియగానే సీఎం విజయన్తో పాటు పలువురు అధికారులు హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి విజయన్తో పాటు ఆయన వెంట ఉన్న అధికారులు క్వారంటైన్లో ఉంటారని సీఎం కార్యాలయం శుక్రవారం (ఆగస్టు 14) తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార, దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ జాతీయ జెండాను ఎగురవేస్తారని పేర్కొంది.
వందేభారత్ మిషన్లో భాగంగా ఆగస్టు 7న 190 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం.. కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పైనుంచి జారిపోయి 35 అడుగుల లోయలో పడిపోయింది. మరికొద్ది క్షణాల్లో స్వదేశంలో అడుగు పెట్టబోతున్నామనే ప్రయాణికుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ సహా మొత్తం 18 మంది మరణించారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల్లో పలువురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
Must Read: అంత లోతులోకి జారిపోయిన విమానం.. మంటలు చెలరేగి ఉంటే!