యాప్నగరం

Reliance: కేర‌ళకు రిల‌య‌న్స్ భారీ విరాళం..

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆపన్నహస్తం అందించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.21 కోట్ల సాయాన్ని కేరళకు ప్రకటించింది.

Samayam Telugu 22 Aug 2018, 12:21 pm
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆపన్నహస్తం అందించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.21 కోట్ల సాయాన్ని కేరళకు ప్రకటించింది. ఈ మేరకు ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. దీంతోపాటు రూ.50 కోట్ల విలువైన రిలీఫ్ మెటీరియల్‌ను కూడా బాధితుల కోసం అందించనున్నారు. ఈ మొత్తాన్ని కేరళలో భారీగా నష్టపోయిన ఎర్నాకులం, వయనాడ్, అలప్పూజ, థ్రిసూర్, ఇడుక్కి పథనమ్ థిట్టా జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు.
Samayam Telugu reliance-foundation


బాధితుల కోసం తాత్కాలిక నివాసాలను కూడా రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో దాదాపు 15,000 వేల కుటుంబాలు తీవ్రంగా నష్ట పోయాయని ఫౌండేషన్ గుర్తించింది. వారికి త్వరలో రేషన్ సరుకులు, వంట సామాగ్రి, దుస్తులు.. ఇతర అవసరమైన వస్తువులను అందిచనున్నట్లు రిలయన్స్ పౌండేషన్ ప్రకటించింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 160 సహాయక కేంద్రాల్లో ఆశ్రయం పొందిన సుమారు 50,000 మంది బాధితులకు ఆహారంతోపాటు అవసరమైన వస్తువులను ఫౌండేషన్ అందిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.