యాప్నగరం

కేరళ వరదలు: తండ్రిని ఒప్పించి ఎకరం భూమి విరాళంగా ఇచ్చిన స్కూల్ విద్యార్థులు

వరదలతో కష్టాల్లో ఉన్న కేరళకు యావత్ భారతావని చేయూతనిస్తోంది. ఎవరికి వారు తోచిన విధంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే వరద బాధితులకు అండగా మేము ఉన్నామంటూ.. కేరళకు చెందిన ఇద్దరు స్కూల్ విద్యార్థులు ముందుకొచ్చారు. తమ తండ్రిని ఒప్పించి.. ఏకంగా ఓ ఎకరం భూమిని విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.

Samayam Telugu 21 Aug 2018, 3:12 pm
వరదలతో కష్టాల్లో ఉన్న కేరళకు యావత్ భారతావని చేయూతనిస్తోంది. ఎవరికి వారు తోచిన విధంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే వరద బాధితులకు అండగా మేము ఉన్నామంటూ.. కేరళకు చెందిన ఇద్దరు స్కూల్ విద్యార్థులు ముందుకొచ్చారు. తమ తండ్రిని ఒప్పించి.. ఏకంగా ఓ ఎకరం భూమిని విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఎంతోమందికి ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Samayam Telugu Kerala


కేరళలోని పయ్యనూర్ సమీపంలోని కందనకలికి చెందిన స్వాహ, బ్రహ్మలు దగ్గరలోని షెనాయ్ సమరక గవర్నమెంట్ హైస్కూల్‌లో చదువుతున్నారు. అయితే రాష్ట్రంలో వరదల గురించి వారు టీవీలో చూశారు. బాధితుల కష్టాలను చూసి చలించిపోయారు. ఎలాగైనా వారికి సాయపడాలనుకున్నారు. వెంటనే తమ మనసులోని మాటను తండ్రికి చెప్పారు. వరద బాధితులకు సాయం చేద్దామని.. పొలంలో ఓ ఎకరంను సీఎం సహాయక నిధికి ఇద్దామని చెప్పారు. పిల్లల మాటను గౌరవించిన తండ్రి శంకరన్ భూమిని ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.

శంకరన్ తనకున్న 10 ఎకరాల భూమిలో ఓ ఎకరాను సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ భూమి విలువ రూ.40లక్షలు ఉంటుందని.. ఆ డబ్బును విరాళంగా అందజేస్తామన్నారు. పొలాన్ని విరాళంగా ఇవ్వాలని చెప్పగానే తమ తండ్రి ఒప్పుకోవడం సంతోషంగా ఉందంటోంది స్వాహ. తాము ఇచ్చిన విరాళంతో కొంతమంది బాధితులకైనా సాయం అందుతుందని.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలన్నాడు బ్రహ్మ. మరోవైపు భూమిని విరాళంగా ఇచ్చిన స్వాహ, బ్రహ్మలను స్కూల్ టీచర్లతో పాటూ విద్యార్థులు అభినందించారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.