యాప్నగరం

ఆ నటుడి మరణంపై సీబీఐ విచారణ

మిమిక్రీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే కళాభవన్ మణి అనుమానాస్పద స్థితిలో మరణించారు.

TNN 12 Apr 2017, 2:48 pm
ప్రముఖ మలయాళ నటుడు కళాభవన్ మణి గతేడాది అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. అతడి మరణంపై చాలా అనుమానాలున్నట్టు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణి భార్య నిమ్మీ, అతని సోదరుడు హైకోర్టును ఆశ్రయించి... సీబీఐ చేత విచారణ చేయించాలని కోరారు. ఆ పిటిషన్ పై విచారణ పూర్తి చేసిన కోర్టు మణి మరణంపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆదేశించింది. నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసి తమకు నివేదిక సమర్పించాలని కోరింది.
Samayam Telugu kerala high court orders cbi probe into kalabhavan mani death case
ఆ నటుడి మరణంపై సీబీఐ విచారణ


కళాభవన్ మణి... గతేడాది మార్చిలో అతని అవుట్ హౌస్ లోనే స్పృహ కోల్పోయి కనిపించారు. ముగ్గురు స్నేహితులతో కలిసి బాగా తాగి అనంతరం పడిపోయినట్టు ముందు అంతా అనుకున్నారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వారు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో పెద్ద కార్పోరేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రి వారు మణి శరీరంలో మిథైల్ ఆల్కహాల్ ఎక్కువగా ఉందని గుర్తించారు. దానివల్లే ప్రాణంపోయినట్టు ప్రకటించారు. దీంతో ఎవరైనా హత్య చేశారా అన్న అనుమానాలు కుటుంబ సభ్యుల్లో కలిగాయి. మణి భార్య నిమ్మీ, సోదరుడు రామకృష్ణ సీబీఐ విచారణ కోరుతూ కోర్టుకెక్కారు.

మణి 1971 జనవరి 1న కేరళలో జన్మించారు. ముందు జీవనోపాధికి ఆటో నడిపేవారు. తనకున్న మిమిక్రీ కళతో సినిమాల్లో అవకాశాలు పొందారు. తెలుగులో జెమిని, ఆయుధం, అర్జున్, నరసింహుడు, ఎవడైతే నాకేంటి సినిమాలలో నటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.