యాప్నగరం

కేరళలో తొలి కరోనా మరణం.. దేశంలో 20కి చేరిన మృతులు

దేశంలో కరోనా వైరస్ తొలి కేసు నమోదయిన రాష్ట్రం కేరళ.. వుహాన్ నుంచి వచ్చిన ముగ్గురు వైద్య విద్యార్థులకు వైరస్ సోకగా, వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేయడంతో కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

Samayam Telugu 28 Mar 2020, 3:40 pm
దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు కేరళలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 39 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దేశంలోనే తొలి కరోనా కేసు ఈ రాష్ట్రంలో నమోదయిన విషయం తెలిసిందే. తాజాగా, కేరళలో తొలి కరోనా వైరస్ మరణం చోటుచేసుకుంది. మార్చి 22న కరోనా వైరస్ లక్షణాలతో కలంసెరీ హాస్పిటల్‌లో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడు దుబాయ్ పర్యటనకు వెళ్లొచ్చినట్టు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కాగా.. అతడిని కలంసెరీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో చికిత్స అందజేశారు.
Samayam Telugu cioivid15


Read Also:
చైనాలో కరోనా తగ్గుముఖంతో ఆంక్షలు ఎత్తివేత.. వుహాన్‌లో చెలరేగిన హింస

కేరళలోకి నిత్యవసర సరుకులు కొరత ఏర్పడిందని, తమ రాష్ట్రంలోనికి వచ్చే వాహనాలను సరిహద్దుల్లో కర్ణాటక పోలీసులు నిలిపేయడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ లేఖ రాశారు. తలసేరీ-కూర్గ్ 30 నెంబరు జాతీయ రహదారిని కర్ణాటక పోలీసులు దిగ్బంధించి, సరుకు రవాణా వాహనాలను అడ్డుకుంటున్నారని విజయన్ తన లేఖలో వివరించారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

Read Also: స్వదేశానికి వచ్చిన ఆ 15 లక్షల మంది ఎక్కడ?

దేశంలో తొలుత కరోనా వైరస్ కేరళలో వెలుగుచూసినా మహమ్మారిని అరికట్టడానికి కేరళ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ విషయంలో విజయం సాధించినా మార్చి తొలివారంలో దేశంలో కరోనా విజృంభణ తరువాత కేరళలో కేసుల సంఖ్య ఒకేసారి పెరిగిపోయింది. కేరళలో ఇప్పటివరకు మొత్తం 176 కేసులు నమోదుకాగా నిన్న ఒక్కరోజే 39 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో 34 కేసులు ఒక్క కాసర్‌గడ్ ప్రాంతంలో బయటపడటం విశేషం. కాసర్‌గడ్‌లో 34, కన్నూరులో 2, కాలికట్, కొల్లామ్, త్రిస్సూర్‌లో ఒక్కో కేసు నమోదయ్యింది. కాగా ఇప్పటి వరకు నమోదైన కేసులలో 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.