యాప్నగరం

కేరళలో రేపిస్టులకు దిమ్మతిరిగే చట్టం

రేపిస్టులు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే చట్టం చేసేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లైంగికదాడులకు పాల్పడే

Samayam Telugu 23 Feb 2017, 4:47 pm
రేపిస్టులు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే చట్టం చేసేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లైంగికదాడులకు పాల్పడే నిందితుల వివరాలు ప్రజలందరికి అందుబాటులో ఉంచేలా ప్రత్యేక ‘రిజిస్ట్రీ’ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళ గవర్నర్ జస్టిస్ (రిటైర్డ్) పి.సదాశివమ్ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. రేపిస్టులను కఠినంగా శిక్షించడంతో పాటు వారు తలెత్తుకోకుండా చేసేందుకు తన ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టనుందని ఆయన తెలిపారు.
Samayam Telugu kerala to launch sex offenders registry to be public
కేరళలో రేపిస్టులకు దిమ్మతిరిగే చట్టం


ఈ తరహా చర్యలు చేపట్టడం ఇదే ప్రథమమని గవర్నర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నాల్గో సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.

అత్యాచార బాధితులకు నష్టపరిహారం కూడా అందించే ఏర్పాటు చేయనున్నట్లు జస్టిస్ సదాశివమ్ వెల్లడించారు. ఓ నటిపై అత్యాచారం జరిగిన నేపథ్యంలో...కేరళ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది.

మహిళలపై దాడులను అరికట్టేందుకు ప్రతి తాలుకాలో మహిళా పోలీస్ స్టేషన్ తో పాటు..ప్రత్యేక మహిళా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామాన్ని మహిళా కానిస్టేబుళ్లు సందర్శించి అక్కడి సమస్యలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.