యాప్నగరం

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించిన కేరళ..!

రోజురోజుకు పెరుగుతున్న ఇంధ ధరల భారం నుంచి కేరళ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌ ధరపై రూ.1 తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేరళ పినరయి విజయన్‌ బుధవారం (మే 30) ప్రకటించారు.

Samayam Telugu 31 May 2018, 1:46 am
రోజురోజుకు పెరుగుతున్న ఇంధ ధరల భారం నుంచి కేరళ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌ ధరపై రూ.1 తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేరళ పినరయి విజయన్‌ బుధవారం (మే 30) ప్రకటించారు. తగ్గించిన ధరలు శుక‍్రవారం (జూన్‌ 1) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇందులో భాగంగా ఇంధనంపై 'రిటైల్‌ వ్యాట్‌'ను తగ్గిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఇటీవల అడ్డూ అదుపులేకుండా పరుగులు పెట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు అడ్డుకట్ట వేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచిందని తెలిపారు.
Samayam Telugu vijayan


దీనివల్ల రాష్ట్ర ఖజానాపై 509 కోట్ల రూపాయల భారం పడుతున్న.. ప్రజల ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్రం చేయలేని పని మేం చేశామని అన్నారు. ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా మాత్రం పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.

గత వారం పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. చమురు ధరల పెంపు వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం మాకూ తెలుసు. అయితే ధరల పెంపు అనేది మా చేతిలో లేదు. అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. అయిన పరిష్కారం దిశగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.