యాప్నగరం

తుక్కుగా మారాల్సిన డొక్కు బస్సులు పిల్లలకు క్లాస్‌రూమ్‌లుగా.. మంత్రిగారి ఐడియా అదిరింది!

ఓవైపు సర్కారు బడుల్లో తరగతి గదుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో పాత బస్సులను చాలా కాలంగా మూలన పడేశారు. వాటిని తుక్కుగా మార్చేస్తే కొంత డబ్బు వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ రవాణా శాఖ మంత్రికి మాత్రం వాటిని క్లాస్‌రూమ్‌లు మార్చేసే తరగతి గదుల కొరతకు పరిష్కారం లభిస్తుందనిపించింది. ఆ ఆలోచనను విద్యాశాఖ మంత్రికి చెప్పడం.. ఆయనకు కూడా ఆ ఐడియా నచ్చడంతో త్వరలోనే కేరళలో క్లాస్ రూం బస్సులు దర్శనం ఇవ్వనున్నాయి.

Authored byరవి కుమార్ | Samayam Telugu 18 May 2022, 7:14 am
ఏళ్ల తరబడి ప్రయాణికులను చేరవేసి డొక్కుగా మారిన బస్సులను తుక్కుగా మార్చేయడం ఆర్టీసీ లాంటి సంస్థలకు అలవాటే. కానీ ఇక నుంచి పాత బస్సులను తుక్కుగా మార్చకుండా.. పిల్లలకు పాఠాలు నేర్పే తరగతి గదులుగా మార్చాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్లోర్ ఎత్తు తక్కువగా ఉండే రెండు బస్సులను ప్రయోగాత్మకంగా తన నియోజకవర్గం పరిధిలోని మనకౌడ్ ప్రభుత్వ పాఠశాలకు ఇస్తామని కేరళ రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు తెలిపారు. ఆ బస్సులను క్లాస్‌రూమ్‌లుగా మార్చనున్నారు.
Samayam Telugu ksrtc buses kerala
File photo of KSRTC buses


విద్యశాఖతో సమగ్రంగా చర్చించిన తర్వాతే బస్సులను శాశ్వతంగా క్లాసురూమ్‌లుగా మార్చడంపై నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. మంత్రి సొంత నియోజకవర్గంలో చేపట్టబోయే ఈ ప్రయోగం విజయవంతమైతే.. మిగతా జిల్లాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు.

‘పిల్లలకు ఇదో కొత్త అనుభూతి. విద్యాశాఖ మంత్రికి కూడా ఈ ఆలోచన నచ్చింది’ అని ఆంటోనీ రాజు తెలిపారు. ఓవైపు ఆర్టీసీ వద్ద పాత బస్సులు పెద్ద సంఖ్యలో మూలన పడి ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు తరగతి గదుల కొరతను ఎదుర్కొంటున్నాయి. భవనాల నిర్మాణం పూర్తవడం ఆలస్యం అవుతుండటంతో తరగతి గదులు సరిపడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల భవనాల నిర్మాణం పూర్తయ్యేంత వరకు పాత బస్సులను క్లాస్‌రూమ్‌లుగా మార్చి వాడుకోవచ్చనేది కేరళ రవాణా శాఖ మంత్రి ఆలోచన.

కేఎస్ఆర్టీసీకి చెందిన వందలాది లో ఫ్లోర్ బస్సులు రిపేర్‌ కారణంగా డంపింగ్ యార్డులో మూలన పడి ఉన్నాయి. ఈ బస్సులను స్క్రాప్‌కు ఇవ్వాలని ఇంతకు ముందు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కేరళ యూనివర్సిటీ క్యాంస్‌లో ఆర్టీసీ బస్సును ఇప్పటికే క్లా్స్‌రూమ్‌గా మార్చారు. పప్పనంకోడ్ డిపోకు చెందిన పాత కేఎస్ఆర్టీసీ బస్సును క్రేన్ సాయంతో క్యాంపస్‌కు తరలించి క్లాస్‌రూమ్‌గా మార్చారు. కేరళ వర్సిటీలోని బయోఇన్‌ఫార్మాటిక్స్ విభాగంలో ఈ క్లాస్‌రూమ్ బస్సును ఉంచారు. దీని స్ఫూర్తితోనే బస్సులను తుక్కుగా మార్చడం కంటే క్లాస్ రూమ్‌లుగా మార్చాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. ఐడియా బాగుంది కదూ..!
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.