యాప్నగరం

కేరళ మహిళకు 45 రోజుల్లో 19సార్లు పాజిటివ్.. ఎట్టకేలకు 20వసారి ఉపశమనం

దేశంలోనే తొలిసారి కరోనా వైరస్ కేరళలో వెలుగుచూసింది. జనవరి చివరివారంలో వుహాన్ నుంచి వచ్చిన ఓ మెడికల్ విద్యార్ధిలో వైరస్ బయటపడింది. దీంతో కేరళ ప్రభుత్వం అప్పటి నుంచే మహమ్మారి కట్టడికి చర్యలు ప్రారంభించింది.

Samayam Telugu 24 Apr 2020, 9:14 am
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో 14 నుంచి 28 రోజుల వరకూ ఉంటుంది. ఈ సమయంలోనే కోవిడ్-19 లక్షణాలు ఉంటే బయటపడతాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి.. వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉంటే వ్యాధిని తర్వగా కోలుకుంటారు. ఒకవేళ ఇతర అనారోగ్య కారణాలు ఉంటే వారిలో వైరస్ తగ్గడానికి కొంత సమయం పడుతుంది. అయితే, కేరళకు చెందిన ఓ మహిళకు మాత్రం కరోనా వైరస్ నిర్ధారణ అయిన 42 రోజుల వరకూ మహమ్మారి నుంచి ఊరట లభించలేదు. కరోనా వైరస్‌తో నెలన్నరగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలికి ఎట్టకేలకు ఊరట లభించింది.
Samayam Telugu కరోనా వైరస్



గతంలో కోజికోడ్ జిల్లాలోనూ ఓ వ్యక్తి విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. మార్చి 18న దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడికి 29 రోజుల వరకూ వైరస్ పాజిటివ్‌గానే తేలింది. అనంతరం నెగెటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి ఇంటికి పంపారు. దీంతో కేరళలో క్వారంటైన్ 28 రోజులకు పెంచారు. తబ్లీగ్ జమాత్‌‌కు వెళ్లొస్తున్నవారితో కలిసి రైల్లో ప్రయాణించిన పథనంతిట్టాకు చెందిన యువతికి 22 రోజుల తర్వాత వైరస్ నిర్దారణ అయ్యింది. ఆమెలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా నమూనా పరీక్షల్లో వైరస్ ఉన్నట్టు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.