యాప్నగరం

కిడ్నాపర్లను కాల్చి బాలుడిని కాపాడిన పోలీసులు

కిడ్నాపర్ల చెర నుంచి ఐదేళ్ల బాలుడిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. జనవరి 25న ఢిల్లీలోని ఓ స్కూల్ బస్సుపై దాడిచేసి ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేశారు.

TNN 6 Feb 2018, 11:36 am
కిడ్నాపర్ల చెర నుంచి ఐదేళ్ల బాలుడిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. జనవరి 25న ఢిల్లీలోని ఓ స్కూల్ బస్సుపై దాడిచేసి ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేశారు. రూ.60 ఇస్తేకానీ బాలుడిని అప్పగించమని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దీంతో రంగంలోని దిగిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు వేట మొదలుపెట్టారు. 12 రోజుల అనంతరం మంగళవారం ఉదయం ఒంటిగంట ప్రాంతంలో ఆ పిల్లాడిని సురక్షితంగా కాపాడారు. విద్యార్థిని కాపాడే సమయంలో కిడ్నాపపర్లకు పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
Samayam Telugu kidnapped delhi schoolboy rescued after shootout
కిడ్నాపర్లను కాల్చి బాలుడిని కాపాడిన పోలీసులు


పోలీసులు కాల్పుల్లో ఒక కిడ్నాపర్ చనిపోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. కిడ్నాపర్ల కాల్పుల్లో ఒక బుల్లెట్ పోలీసుకు కూడా తగిలింది. అయితే ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, గణతంత్రదినోత్సవ వేడుకలకు ముందు రోజే ఢిల్లీలో కిడ్నాప్ ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తూర్పు ఢిల్లీ ఐబీహెచ్ఏఎస్ హాస్పిటల్ సమీపంలోని షహదారాలో జనవరి 25వ తేదీ ఉదయం 8 గంటలకు స్కూలు బస్సుపై ఆగంతకులు దాడిచేశారు. డ్రైవర్‌పై కాల్పులు జరిపి ఒక విద్యార్థిని కిడ్నాప్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.