యాప్నగరం

శశికళ, పళనిసామిలపై కిడ్నాప్ కేసు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, పార్టీ శాసనసభాపక్ష నేత పళనిసామిలపై కిడ్నాప్ కేసు నమోదైంది.

Samayam Telugu 15 Feb 2017, 3:06 pm
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, పార్టీ శాసనసభాపక్ష నేత పళనిసామిలపై కిడ్నాప్ కేసు నమోదైంది. తమను అక్రమంగా బంధించారని ఎమ్మెల్యే ఎస్ఎస్ శరవణన్ ఫిర్యాదు మేరకు కువత్తూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Samayam Telugu kidnapping case against sasikala and palanisamy
శశికళ, పళనిసామిలపై కిడ్నాప్ కేసు


శశికళ కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు బయలుదేరి వెళ్లడంతో..నూతనంగా పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన టీవీవీ దినాకరన్ ఎమ్మెల్యేలు బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్స్ చేరుకున్నారు. పళనిసామిని సీఎం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా గవర్నర్ ను మరోసారి కోరేందుకు ఆయన ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా..మైలాపూర్ ఎమ్మెల్యే పి. నటరాజన్..శశికళ, ఓపీఎస్ వర్గాలు ఒక్కటవ్వాలని అన్నారు. అమ్మ ఆశయసాధనకు కలసికట్టుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు టీవీవీ దినాకరన్ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుప్పుసామి పాండియన్ రాజీనామా చేశారు. దినాకరన్ నియామకంపై పార్టీ సీనియర్లు సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ శిబిరంలో ఎంతమంది ఉంటారో..ఎంతమంది ఓపీఎస్ కు జై కొడతారో ఆసక్తిగా మారింది.

గవర్నర్ విద్యాసాగర్ రావు తన నిర్ణయాన్ని బుధవారం సాయంత్రం వెలువరించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.