యాప్నగరం

ఏపీకి గవర్నర్‌గానా.. స్పందించిన కిరణ్‌ బేడీ

తను ఏపీకి గవర్నర్‌గా వెళ్లబోతున్నాను.. అని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ.

Samayam Telugu 30 Mar 2018, 12:43 pm
Samayam Telugu kiranbedi

తను ఏపీకి గవర్నర్‌గా వెళ్లబోతున్నాను.. అని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. త్వరలోనే ఏపీ, తెలంగాణల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను ఆ పదవి నుంచి తప్పిస్తారని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఏపీకి కిరణ్ బేడీని గవర్నర్ గా పంపుతారనే ప్రచారం మొదలైంది.

అయితే ఈ ప్రచారాన్ని ఖండించారు కిరణ్ బేడీ. తను ఏపీకి గవర్నర్ గా వెళ్లబోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. తను పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గానే కొనసాగుతాను అని ఆమె వ్యాఖ్యానించారు. తనకు పుదుచ్చేరి అంటే చాలా ఇష్టమని కూడా ఆమె అనడం విశేషం. ఇలాంటి నేపథ్యంలో తను ఏపీకి వెళ్లే అవకాశాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే.. కిరణ్ బేడీ ఏపీకి గవర్నర్ గా వెళ్లిపోతారనే ప్రచారంతో అక్కడి అధికార పార్టీ వాళ్లు మురిసిపోయారు. సంబరాలే చేసుకున్నారు. అక్కడ సీఎం నారాయణస్వామికి, కిరణ్ బేడీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె బదిలీ అనే మాట అధికార పార్టీ వాళ్లను చాలా ఆనందపెట్టింది. వారి ఉత్సాహంపై నీళ్లు జల్లుతూ.. తను పుదుచ్చేరిలోనే ఉంటానని ప్రకటన చేశారు కిరణ్ బేడీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.