ఎంపీ కీర్తి ఆజాద్ భార్య బీజీపీ నేత పూనమ్ ఆజాద్ ఆమ్ ఆద్మీలోకి వెళ్లిపోయారు. దాదాపు ఇరవై ఏళ్లుగా బీజేపీలో ఉన్న ఈమెకు కొంతకాలంగా ఆ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో ఆప్లో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక కీర్తి ఆజాద్ బిహార్లోని దర్బాంగ లోక్సభ ఎంపీగా ఉన్నారు. కాగా డీడీసీఏలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో అతన్ని ఇటీవల బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సమక్షంలో ఆప్లో చేరారు. కాగా పూనమ్ 2003 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం షీలా దీక్షిత్కు ప్రత్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేసింది.
ఆమ్ ఆద్మీలోకి పూనమ్ ఆజాద్
ఎంపీ కీర్తి ఆజాద్ భార్య బీజీపీ నేత పూనమ్ ఆజాద్ ఆమ్ ఆద్మీలోకి వెళ్లిపోయారు. గత కొంతకాలంగా బీజేపీలో ఆమెకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఆప్లో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
TNN 13 Nov 2016, 6:18 pm