యాప్నగరం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు

BJP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమించింది.

Samayam Telugu 2 Feb 2021, 10:45 pm
మిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన రెడ్డికి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయణ్ని తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమించింది. తమిళనాడుతో పాటు త్వరలో ఎన్నికలు జరుగనున్న 4 రాష్ట్రాలకు ఇన్‌ఛార్జీలు, సహ ఇన్‌ఛార్జీలను నియమించారు. పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు.
Samayam Telugu కిషన్ రెడ్డి
Kishan Reddy


తమిళనాడు ఎన్నికల సహ ఇన్‌ఛార్జీగా కేంద్రంలో మరో సహాయ మంత్రి వీకే సింగ్‌ను నియమించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌‌‌ను అసోం ఇన్‌ఛార్జిగా నియమించారు. సహ ఇన్‌ఛార్జిగా జితేంద్ర సింగ్‌‌కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణాదిలో మరో కీలక రాష్ట్రం కేరళకు బీజేపీ ఇన్‌ఛార్జిగా ప్రహ్లాద్ జోషిని, సహ ఇన్‌ఛార్జిగా కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్‌ నారాయణ్‌‌ను నియమించారు.

కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌కు పుదుచ్చేరి బాధ్యతలు అప్పగించారు. సహ ఇన్‌ఛార్జిగా ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఆదేశాలతో మంగళవారం (ఫిబ్రవరి 2) సాయంత్రం ప్రకటన వెలువడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.