యాప్నగరం

ప్లీజ్.. నన్ను ఆ ఆలయంలో పాడనివ్వండి: కేజే యేసుదాసు

భారతీయ సినీ, సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు కేజే యేసుదాసు. దాదాపు 14 భాషల్లో...

TNN 17 Sep 2017, 10:41 pm
భారతీయ సినీ, సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు కేజే యేసుదాసు. దాదాపు 14 భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బంలు, భక్తిరస గీతాలు కలుపుకుని సుమారు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన. అటువంటి గొప్ప సింగర్ తనని మీ ఆలయంలో పాడనివ్వండి ప్లీజ్ అంటూ కేరళలోని ప్రఖ్యాత శ్రీపద్మనాభస్వామి దేవాలయం అధికారులకి అర్జీ పెట్టుకున్నారు. ఈ నెలాఖరున విజయదశమి సందర్భంగా ఆలయంలో స్వరార్చన చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన శ్రీ పద్మనాభ స్వామి దేవాలయ అధికారులకు తన ప్రతినిధి ద్వారా ఓ లేఖ రాసి పంపించారు.
Samayam Telugu kj yesudasu seeks temple officials to allow him to sing a song
ప్లీజ్.. నన్ను ఆ ఆలయంలో పాడనివ్వండి: కేజే యేసుదాసు


హిందూ మతంపై విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ఆలయంలో ప్రవేశముంటుంది అనేది అక్కడి ఆలయ కమిటీ నిబంధన. ఆలయ కమిటీ నిబంధనల ప్రకారం ఇక్కడ అన్యమతస్తులకి ప్రవేశం లేదు. కానీ అయ్యప్ప స్వామి మొదులుకుని శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శివుడిపై వివిధ భాషల్లో అనేక పాటలు పాడిన తనకి పద్మనాభ స్వామి ఆలయంలో సైతం పాటలు పాడే అవకాశం ఇప్పించండి అని కేజే యేసుదాసు విజ్ఞప్తి చేస్తున్నారు. క్రైస్తవ రోమన్‌-క్యాథలిక్‌ కుటుంబంలో పుట్టిన యేసుదాసుకు తమ దేవాలయంలో గానామృతం పంచవచ్చా లేదా అనే తుది నిర్ణయం తీసుకునే అధికారం ప్రస్తుతం ఆ ఆలయ కమిటీ చేతుల్లోనే వుంది.

దేవాదాయ శాఖ అధికారుల అనుమతి కోసం కేజే యేసుదాసు ఎదురుచూస్తున్న ఆలయాలలో త్రిశూరులోని గురువాయూరప్పన్ ఆలయం కూడా వుంది. గురువాయురప్పన్ ఆలయంలో పాట పాడటానికి కేజే యేసుదాసు ఎప్పటినుంచో అక్కడి ఆలయ అధికారులు, కమిటీకి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.