యాప్నగరం

బ్యాగులో అప్పుడే పుట్టిన చిన్నారుల మృతదేహాలు

అప్పుడే పుట్టిన చిన్నారుల మృతదేహాలను ఆ స్థితిలో చూడటం నిజంగా చాలా బాధాకరమని పోలీసులు అన్నారు.

Samayam Telugu 2 Sep 2018, 8:31 pm
దక్షిణ కోల్‌కతాలోని హరిదేవ్‌పూర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన 14 నవజాత శిశువుల మృతదేహాలను ఆదివారం గుర్తించిన స్థానికులు షాక్ తిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శిశువుల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేపట్టారు. ఉద్దేశ పూర్వకంగా జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు పోలీసులు.
Samayam Telugu new born babies bodies


హరిదేవ్‌పూర్‌లోని రాజా రాంమోహన్ రాయ్ ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. ఇంతలో ఓ కార్మికుడు అక్కడ తొలుత ఓ ప్లాస్టిక్ బ్యాగును గమనించాడు. బ్యాగు విప్పి చూసిన కార్మికుడికి అందులో నవజాత శిశువు మృతదేహం కనిపించింది. ఏదో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి ఆ ఖాళీ స్థలాన్ని పరిశీలించగా మరికొన్ని బ్యాగులు ఉన్నాయి. ప్లాస్టిక్ బ్యాగులలో మొత్తంగా 14 మంది నవజాత శిశువుల మృతదేహాలు సగం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. సమాచారం అందుకున్న నగర మేయర్ సోవన్ చటర్జీ, కమిషనర్ రాజీవ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

రాజీవ్ కుమార్ న్యూస్ ఏజెన్సీ పీటీఐతో మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన చిన్నారుల మృతదేహాలను ఆ స్థితిలో చూడటం బాధాకరం అన్నారు. శిశువులను ఉద్దేశం ప్రకారమే హత్య చేసి ఉంటారని.. ఖాళీ ప్రదేశంలో పడవేస్తే ఎవరూ గుర్తించరని నిందితులు భావించి ఉంటారని నగర సీపీ వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.