యాప్నగరం

ఐసీజే తీర్పు పట్ల ప్రధాని మోదీ హర్షం

కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం

Samayam Telugu 18 May 2017, 5:30 pm
కుల్ భూషణ్ జాదవ్ కు పాకిస్థాన్ విధించిన ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఇచ్చిన తీర్పు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కుల్ భూషణ్ కు మద్దతుగా (ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ) అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించిన భారత న్యాయనిపుణులు సహా విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ను మోదీ అభినందించారు.
Samayam Telugu kulbhushan jadhav verdict modi speaks to sushma praises efforts in icj
ఐసీజే తీర్పు పట్ల ప్రధాని మోదీ హర్షం


భారత్ వాదనలు గట్టిగా వినిపించిన న్యాయనిపుణులు హరీష్ సాల్వేను సుష్మాస్వరాజ్ అభినందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కుల్ భూషణ్ ను కాపాడుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సుష్మ స్పష్టం చేశారు.

పాకిస్థాన్ ఉరిశిక్షను నిరసిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయపోరాటం చేసిన విదేశీ వ్యవహారాల శాఖ సిబ్బందిని కూడా ఆమె అభినందించారు.

We are grateful to Mr.Harish Salve for presenting India's case so effectively before ICJ.— Sushma Swaraj (@SushmaSwaraj) May 18, 2017 <

I assure the nation that under the leadership of Prime Minister Modi we will leave no stone unturned to save #KulbhushanJadhav.— Sushma Swaraj (@SushmaSwaraj) May 18, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.