యాప్నగరం

కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు ఉంచిన విశ్వాస్

ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ తమ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారు.

TNN 3 May 2017, 11:29 am
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన కుమార్ విశ్వాస్‌ను కలిసి మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన కేజ్రీవాల్ ముందు పలు డిమాండ్లను ఉంచారు. పార్టీలో అవినీతిని ఏ మాత్రం సహించొద్దనేది విశ్వాస్ తొలి షరతు కాగా.. కార్యకర్తలను ప్రభావితం చేసే ఏ నిర్ణయాన్నైనా.. అందరితో చర్చించాకే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోకుండా పెద్దలతో కలిసి మాట్లాడాకే ఓ నిర్ణయానికి రావాలన్నారు. తన ‘వియ్ ద నేషన్’ వీడియో పట్ల ఎలాంటి క్షమాపణ చెప్పబోనన్నారు.
Samayam Telugu kumar vishwas has three main demands
కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు ఉంచిన విశ్వాస్



కుమార్ విశ్వాస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పార్టీ కన్వీనర్ పదవిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో కుమార్ విశ్వాస్ మనస్తాపం చెందారు. పార్టీ నుంచి బయటకు వచ్చే దిశగా ఆలోచనలు చేశారు. దీంతో ఆయన్ను బుజ్జిగించేందుకు అరవింద్ కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. మంగళవారం అర్ధరాత్రి ఆయనతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిగా మెత్తబడిన విశ్వాస్ పార్టీ అధినేత ముందు తన డిమాండ్లను ఉంచారు. కుమార్ విశ్వాస్‌ను కలిసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఆయన పార్టీలో కొనసాగేలా ఒప్పించగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.