యాప్నగరం

ఆయన సీఎం అవుతారని స్వామీజీ జోస్యం!

తాళపత్రాలను ఆధారంగా చేసుకుని జోస్యం చెప్పడం ఈ స్వామీజీ ప్రత్యేకత. వాటిని పరిశీలించి 2018లో జరగనున్న

TNN 4 Jul 2017, 12:27 pm
ఇదివరకూ రెండున్నరేళ్ల పాటు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జేడీఎస్ నేత కుమారస్వామి మళ్లీ ఆ రాష్ట్రానికి సీఎం అవుతారని ఒక స్వామీజీ జోస్యం చెప్పారు. కర్ణాటకలోని హారనహళ్లి కోడిమఠం పీఠాధిపతి శివానంద శివయోగి రాజేంద్ర స్వామీజీ ఈ జోస్యం చెప్పారు. కుమారస్వామి మళ్లీ సీఎం కావడం తథ్యం అని స్వామీజీ చెప్పారు.
Samayam Telugu kumaraswamy will become cm again
ఆయన సీఎం అవుతారని స్వామీజీ జోస్యం!


తాళపత్రాలను ఆధారంగా చేసుకుని జోస్యం చెప్పడం ఈ స్వామీజీ ప్రత్యేకత. వాటిని పరిశీలించి 2018లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది కుమారస్వామి సీఎం కావడం ఖాయం అని స్వామీజీ అన్నారు. అయితే జేడీఎస్ సొంతంగా మెజారిటీ సంపాదించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని మాత్రం స్వామీజీ చెప్పకపోవడం గమనార్హం.

కర్ణాటకలో హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడవచ్చని.. మహాకూటమి ఏర్పడుతుందని, కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతాడని స్వామీజీ అన్నారు. ఇది వరకూ కూడా భారతీయ జనతా పార్టీతో కూటమిగా ఏర్పడి జేడీఎస్ అధికారంలోకి వచ్చింది. కుమారస్వామి సీఎం అయ్యారు. పొత్తుధర్మంలో భాగంగా యడ్యూరప్పకు సీఎం పీఠాన్ని అప్పగించాల్సిన దశలో కుమారస్వామి మోసం చేశారు. బీజేపీకి ఝలక్ ఇచ్చారు. దీంతో ఎన్నికలు వచ్చాయి.

తదుపరి బీజేపీ మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఆ తర్వాత మళ్లీ జేడీఎస్ సత్తా చాటలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది తామేనని అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. స్వామీజీ ఏమో కుమారస్వామికి మళ్లీ ముఖ్యమంత్రి యోగం ఉందని జోస్యం చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.