యాప్నగరం

రాజస్థాన్‌లో గజ దొంగను మట్టుబెట్టిన ఏపీ పోలీసులు

రాజ‌స్థాన్‌లోని జాలోర్ జిల్లా సాంచౌర్‌లో ఎన్‌కౌంటర్ చేసిన ఆంధ్రా పోలీసులు భీమ్ సింగ్ రావ్ అనే గజ దొంగను హతమార్చారు.

TNN 27 Oct 2017, 7:09 pm
రాజ‌స్థాన్‌లోని జాలోర్ జిల్లా సాంచౌర్‌లో ఎన్‌కౌంటర్ చేసిన ఆంధ్రా పోలీసులు భీమ్ సింగ్ రావ్ అనే గజ దొంగను హతమార్చారు. 144 కేసుల్లో నిందితుడిగా ఉన్న భీమ్ సింగ్‌ కోసం పోలీసుల భారీ ఆపరేషన్ చేపట్టారు. గ‌తంలో కర్నూలు జిల్లాలో దోపిడీలు చేసిన భీమ్ సింగ్ ముఠా రూ. 5 కోట్లకు పైగా దోచుకుంది. ఈ ముఠా ఇత‌ర రాష్ట్రాల్లోనూ దోపిడీల‌ు చేసింది. భీమ్ సింగ్ ముఠాపై కేసు న‌మోదు చేసిన క‌ర్నూల్ పోలీసులు మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.
Samayam Telugu kurnool police encountered a most wanted robber bheem singh in rajasthan
రాజస్థాన్‌లో గజ దొంగను మట్టుబెట్టిన ఏపీ పోలీసులు


భీమ్ సింగ్ రాజస్థాన్‌లో ఉన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. కార్లో వెళ్తున్న అతణ్ని వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం భీమ్ సింగ్ కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో.. భీమ్ సింగ్ హతమయ్యాడు. ఈ కాల్పుల్లో అతడి కారు డ్రైవర్‌తో పాటు మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది.

హైదరాబాద్ బెంగుళూరు మార్గంలో బంగారం వ్యాపారులు నిత్యం కోట్లాది రూపాయాల విలువైన బంగారం మార్పిడి చేస్తారు. ఈ విషయాన్ని పసిగట్టిన భీమ్‌సింగ్ ముఠా సెప్టెంబర్లో కర్నూల్ జిల్లా డోన్ వద్ద వాహనాన్ని ఆపి రూ.5 కోట్లను దోచుకెళ్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.