యాప్నగరం

ఒక్క రోజు కుండపోత.. కరవు సీమలో రైతన్న ఆనంద హేళ!

వర్షాలు పడకపోతే ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనడానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తు పరిస్థితులే నిదర్శనం. ఏళ్ల తరబడి సరిగా వానలు కురవకపోతే పరిస్థితి భయానకంగా ఉంటుంది. అలాంటి కరవు సీమలో ఒక్క భారీ వర్షం ఆనందాన్ని నింపింది.

Samayam Telugu 1 Aug 2019, 12:54 pm
వర్షాలు సకాలంలో కురవకపోతే.. రైతన్నలు పడే బాధ అంతా ఇంతా కాదు. వానలు పడకపోతే పంటలు పండవు. దీని ప్రభావం ఒక్క రైతాంగం మీదే దేశ ప్రజలందరి మీదా ఉంటుంది. పంట దిగుబడి తగ్గితే ఆహార ధాన్యాల ధరలు కొండెక్కుతాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. రైతన్నలు ఒక్క భారీ వర్షం కురిస్తే బాగుండని కోరుకుంటున్నారు. ఇక్కడ అరకొరగా కురుస్తున్న వర్షాలు ఉత్తరాదిన మాత్రం కుండపోతలా కురుస్తున్నాయి.
Samayam Telugu kutch


గుజరాత్‌లోని వర్షాభావ ప్రాంతమైన కచ్‌లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాస్తవానికి కచ్‌ ప్రాంతంలో గతేడాది కరువు వచ్చింది. ఈసారి కూడా వానలు పడకపోతే ఎలా అని జనం బెంగ పెట్టుకున్నారు. కానీ మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. ఒక్క రోజే సగటున 58 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అబ్డాసాలో 66 మి.మీ. వర్షం కురవగా.. అంజర్‌లో 74 మి.మీ., మండ్వీలో 120 మి.మీ. వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షం కారణంగా ఈ ప్రాంతంలోని చెరువులు, చిన్న డ్యామ్‌లు అలుగు పోస్తున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత జలసిరి ఉట్టిపడుతోన్న నారాయణ్ సరోవర్, పాలార్‌గుణ ఫాల్స్‌ను చూడటం కోసం జనం పోటెత్తుతున్నారు. కరవుకు కేరాఫ్ లాంటి ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో.. గుజరాతీల ఆనందానికి హద్దులేకుండా పోయింది. మన దగ్గర కూడా ఇలాంటి వర్షం కురిస్తే బాగుంటుంది కదూ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.