యాప్నగరం

లడఖ్‌ వద్ద వెనక్కి వెళ్లి.. ఉత్తరాఖండ్‌వైపు భారీగా సైన్యాలను మోహరిస్తోన్న చైనా

దాదాపు మూడు నెలలుగా సరిహద్దుల్లో భారత్, చైనాాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గినట్టే తగ్గి మరోసారి పెరుగుతున్నాయి. పొరుగుదేశం మళ్లీ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది.

Samayam Telugu 2 Aug 2020, 10:39 am
సరిహద్దుల్లో తన బలగాలను వెనక్కు మళ్లించినట్టు ప్రకటించిన డ్రాగన్, మళ్లీ ఉద్రిక్తతలు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద సైన్యాన్ని ఉపసంహరించిన చైనా.. తాజాగా, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌వైపు భారీగా బలగాలను మోహరిస్తోంది. ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని లిపులేక్ ప్రాంతాన్ని నేపాల్ తమ భూభాగంగా ప్రకటించుకుంది. ఇటీవల కాలంలో నేపాల్‌కు దగ్గరైన చైనా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏకంగా తన సైన్యాన్నే మోహరిస్తోంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి రోజులు కూడా గడవకముందే మళ్లీ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది.
Samayam Telugu భారత్ చైనా సరిహద్దలు
India China Border


లిపులేఖ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఉత్తర ప్రాంతాల్లోకి చైనా భారీగా సైన్యాలను మోహరిస్తోంది. డ్రాగన్ కుట్రలను పసిగట్టిన భారత్ అప్రమత్తమయ్యింది. ను సరిహద్దుల వద్దకు చైనాలను తరలిస్తోంది. చైనా వెనక్కు తగ్గుతుందా? లేదా? అన్న దానితో సంబంధం లేకుండా తాము ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాలకు సైన్యాన్ని తరలిస్తున్నట్టు సైనికాధికారులు తెలిపారు. మరోవైపు, లడఖ్ నుంచి వెనక్కి తగ్గుతున్నట్టు చెప్పిన చైనా వాస్తవాధీన రేఖ వెంబడి శాశ్వత సైనిక స్థావరాలను నిర్మిస్తోంది.

తొలి దశ బలగాల ఉపసంహరణ పూర్తయి.. గాల్వన్ లోయ వద్ద బఫర్ జోన్ ఏర్పాటుచేసినా... పాంగాంగ్ సరస్సు, దెప్పాంగ్ మైదానాల్లో మాత్రం చైనా సైన్యం ఇంకా తిష్టవేసి ఉంది. అరుణాచల్‌పై కొత్తగా సైన్యాన్ని తరలిస్తుండగా.. సరిహద్దు ఉద్రిక్తతలపై మరోసారి కమాండర్ స్థాయి చర్చలు ఆదివారం జరుగనున్నాయి. వాస్తవానికి జులై 30న 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, జిన్జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియు లిన్ మధ్య ఐదో విడత చర్చలు జరగాల్సి ఉన్నా.. చైనా వైఖరితో భారత్ ఆసక్తి ప్రదర్శించలేదు.

దీంతో, భారత్ వ్యూహాన్ని అంచనా వేయడానికి చైనా ఉన్నతాధికారులు ఈ వారం ఓ సమావేశాన్ని నిర్వహించిన తరువాత, పాంగోంగ్ సరస్సు, గోగ్రాలోని పెట్రోలింగ్ పాయింట్ -17ఎ వద్ద బలగాలను ఉపసంహరణ విషయంలో తాత్సారం చేస్తోదని అధికార వర్గాలు తెలిపాయి. ‘జులై 14న నాలుగో దశ చర్చల సందర్భంగా చేసిన ప్రతిపాదనలను అమలు చేయాలా? వద్దా? అని ఇంకా ఆలోచిస్తోందని... ఆమోదయోగ్యమైనవి, లేనివి ఖరారు చేయడానికి సమయం పడుతుంది.. దీనికి రాజకీయ ఆమోదం అవసరమని’ ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.