యాప్నగరం

ఆయన రాష్ట్రపతి కాకుండా మోదీ కుట్ర: లాలూ

బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుట్ర పన్నారని ఆర్జేడీ అధినేత

Samayam Telugu 19 Apr 2017, 3:03 pm
బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుట్ర పన్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్.కే. అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలకు వ్యతిరేకంగా బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu lalu prasad says modis conspiracy to remove advani from president race
ఆయన రాష్ట్రపతి కాకుండా మోదీ కుట్ర: లాలూ


అద్వానీ రాష్ట్రపతి కాకుడదనే ఉద్దేశ్యంతోనే మోదీ బాబ్రీ మసీదు కేసును తిరగదోడారని లాలూ విమర్శించారు.
‘సీబీఐ ప్రధానమంత్రి చెప్పు చేతుల్లో ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ హస్తం ఉందని సీబీఐ బలంగా వాదిస్తోంది. అందుకే సుప్రీంకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించింది. రాష్ట్రపతి రేసులో అద్వానీ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అద్వానీ రాష్ట్రపతి కావడం మోదీకి ఇష్టం లేదు. రాష్ట్రపతి రేసు నుంచి అద్వానీని తప్పించేందుకు మోదీ రాజకీయ కుట్రం చేశారని ఎవరికైనా అర్థమవుతోంది’ అని లాలూ వ్యాఖ్యానించారు.

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లలో అద్వానీ ఆయనకు మద్దతిచ్చారని, మోదీ మాత్రం అద్వానీని పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.