యాప్నగరం

లాలూకు బెయిల్.. అయినా, జైలు లోపలే!

Bihar: పశుగ్రాసం (గడ్డి) కుంభకోణంలో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ వచ్చింది. కానీ, ఆయన జైల్లోనే కొనసాగనున్నారు.

Samayam Telugu 10 Oct 2020, 2:23 am
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు బెయిల్ వచ్చింది. కానీ, ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. ఝార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం (అక్టోబర్ 9) చైబసా ఖజానా కేసులో లాలూకు రూ. 2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే.. దుమ్కా ఖజానా కేసులో శిక్ష పడినందున ఆయన జైల్లోనే ఉండనున్నారు.
Samayam Telugu లాలూ ప్రసాద్ యాదవ్
Lalu Prasad Yadav bail


పశుగ్రాసం (Fodder Scam) కుంభకోణానికి సంబంధించిన వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1990ల్లో లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగిన ఈ కేసులో 2017 డిసెంబరులో దోషిగా తేలడంతో శిక్ష ఖరారైంది. నాటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు.

కరోనా పరిస్థితుల దృష్ట్యా లాలూకు పెరోల్‌ ఇవ్వాలని ఇటీవల ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ కోరారు. జైల్లో తరచూ ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ ఆయణ్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఈసారి లాలూ లేకుండానే బిహార్ ఎన్నికలు పూర్తయ్యేలా కనిపిస్తోంది.

Also Read: ట్రంప్‌ను కరోనా వైరస్ కూడా మార్చలేకపోయిందే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.