యాప్నగరం

తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన లెఫ్ట్ పార్టీల ర్యాలీ

లాఠీ చార్జీలో కార్యకర్తలతో పాటు, చాలా మంది ముఖ్య నేతలు కూడా గాయపడ్డారు..

TNN 22 May 2017, 4:16 pm
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనకు వ్యతిరేంగా లెఫ్ట్ పార్టీలు చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. వామపక్ష భావజాలానికి చెందిన 11 పార్టీలు 18 డిమాండ్లతో ఇవాళ (మే 22) ఆ రాష్ట్ర సెక్రటేరియట్ (నబన్నా అవిజన్) ముట్టడికి ప్రయత్నించాయి. జాధవ్‌పూర్ ఎమ్మెల్యే సుజన్ చక్రవర్తితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు పోలీసుల కళ్లుగప్పి సెక్రటేరియట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. నిరసన కార్యక్రమం మొదలవడానికి ముందుగానే అక్కడికి చేరుకున్న ఈ అయిదుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Samayam Telugu left protest against mamata government turns violent in kolkata
తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన లెఫ్ట్ పార్టీల ర్యాలీ



ఆ తర్వాత కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల నుంచి లెఫ్ట్ పార్టీల కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున ర్యాలీగా సెక్రటేరియట్ వైపు తరలివచ్చారు. పోలీసులు వీరిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో వీరిలో కొంత మంది పోలీసులపై రాళ్లు రువ్వారు. తమ వెంట తెచ్చిన వెదురు కర్రల (పార్టీ జెండాలను కట్టినవి)తో కొంత మంది కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీలకు పని చెప్పారు.

లాఠీ చార్జీలో కార్యకర్తలతో పాటు, చాలా మంది ముఖ్య నేతలు కూడా గాయపడ్డారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఉద్రిక్తలకు దారి తీస్తున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కేబినెట్ మంత్రుల్లోనే చాలా మంది అక్రమార్కులు ఉన్నారని విమర్శలు వస్తున్నాయి.

Read this in Bengali

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.