యాప్నగరం

జాతి వైరాన్ని మరిచిన చిరుత... పర్యాటకులతో వింత ప్రవర్తన.. షాకింగ్ వీడియో

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హిమాచల్‌ప్రదేశ్‌లో చిరుతపులి వింతగా ప్రవర్తించింది. పర్యాటకుల వద్దకు వెళ్లి వారితో పెంపుడు శునకంలా ఆప్యాయంగా ఆడుతూ కనిపించింది.

Samayam Telugu 15 Jan 2021, 11:41 am
అడవిలో ఉండే చిరుత మన ముందు ప్రత్యక్షమైతే ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లుగా అనిపించక మానదు. అలాంటిది చిరుత కళ్లముందు తిరుగుతుంటే అక్కడి వారు వణకలేదు.. భయపడలేదు. ఆ చిరుత కూడా జాతి వైరాన్ని మరిచి మనుషుల వద్దకు వచ్చి వింతగా ప్రవర్తించింది. చిన్నపిల్లలు తమను ఎత్తుకోమని మారం చేసినట్లుగా మనుషుల చేతులు పట్టుకుని వేలాడుతూ వింతగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని తీర్థన్ వ్యాలీలో చోటుచేసుకుంది.
Samayam Telugu పర్యాటకులతో చిరుత


హిమాచల్‌ప్రదేశ్‌ అంటేనే పర్యాటకులకు స్వర్గధామం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్థన్ వ్యాలీకి పర్యాటకులు వాహనాల్లో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డుపై కనిపించింది. దీంతో వారంతా తమ వాహనాలను ఆపేసి ఆసక్తిగా గమనించారు. పర్యాటకులు రోడ్డుపై నిలబడి ఉండగా ఆ చిరుత వారి పక్కనుంచే దర్జాగా నడుచుకుంటూ వెళ్లి.. మళ్లీ వెనక్కి తిరిగింది. ఓ వ్యక్తిపైకి ఎగబాకి ఎంతో పెంపుడు శునకంలా ప్రవర్తించింది. సుమారు నిమిషం పాటు పర్యాటకుల మధ్య తిరిగినా ఎవరికీ హాని చేయలేదు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.