యాప్నగరం

అడవిలో ధ్యానం.. బౌద్ధ సాధువును బలిగొన్న చిరుత!

ప్రశాంత వాతావరణం కోసం అడవిలోకి వెళ్లి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్న ఓ బౌద్ధ సాధువును చిరుత పులి బలి తీసుకుంది.

Samayam Telugu 14 Dec 2018, 1:48 pm
అడవిలో చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న ఓ బౌద్ధ సాధువు చిరుత దాడిలో బలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని టడోబా అడవుల్లో చోటు చేసుకుంది. పులుల సంరక్షిత ప్రాంతమైన ఈ అడవులకు సమీపంలోనే ఓ బౌద్దాలయం ఉంది. అక్కడే సాధువులు ధ్యానం చేసుకుంటుంటారు. ప్రశాంతత కోసం కొందరు సాధువులు సమీపంలోని అడవిలోకి వెళ్తుంటారు. రాహుల్ వాల్కే అనే ఓ బౌద్ద సాధువు కూడా నెల రోజులపాటు అలాగే అడవిలో ధ్యానం చేశాడు. ఇద్దరు సాధువుల అతడికి రోజూ మంచి నీరు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చేవారు. మంగళవారం వారిద్దరూ వెళ్లి చూసే సరికి అతడు విగత జీవిగా పడి ఉన్నాడు.
Samayam Telugu Leopord-attack


చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన సాధువు కుటుంబానికి ఫడ్నవీస్ సర్కారు రూ.12 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులులు, చిరుతలతోపాటు ఎలుగుబంట్లు, హైనాలు కూడా ఉన్నాయి. దీంతో అడవి లోపలికి వెళ్లొద్దని సాధువులను గతంలోనే హెచ్చరించామని అటవీ శాఖాధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.