యాప్నగరం

Delhi Excise Policy: చిక్కుల్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం.. మద్యం స్కామ్‌లో A1 నిందితుడుగా చేర్చిన సీబీఐ

ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఏ1 ముద్దాయిగా చేర్చింది. ఢిల్లీ మద్యం పాలసీలో (Delhi Excise Policy)అవినీతి, అక్రమాలు జరిగాయని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సిసోడియా ఇంటితో సహాం మొత్తం 20 దగ్గర్లో తనిఖీలు నిర్వహించింది. సిసోడియాతో పాటు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, అప్పటి డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్, తొమ్మిది మంది వ్యాపారవేత్తలు, రెండు కంపెనీలను సీబీఐ నిందితులుగా పేర్కొంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 19 Aug 2022, 8:05 pm

ప్రధానాంశాలు:

  • 20 ప్రదేశాల్లో తనిఖీలు చేసిన సీబీఐ
  • ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 15 మంది పేర్లు
  • మద్యం పాలసీలో అవినీతి జరిగిందని కేసు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Manish Sisodia
Delhi Excise Policy: ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా ఇబ్బందుల్లో పడ్డారు. మద్యం స్కామ్‌లో అతడిని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా చేర్చింది. సిసోడియాతో సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి. మనీష్ సిసోడియా సహచరుడు నిర్వహిస్తున్న కంపెనీకి మద్యం వ్యాపారి కోటి రూపాయలు చెల్లించారని, 2021-22 ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అవినీతి జరిగిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
సీబీఐ అధికారులు ఢిల్లీలోని సిసోడియా అధికారిక నివాసంతో పాటు ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 20 ఇతర ప్రదేశాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఏజెన్సీ, నేరపూరిత కుట్ర, నిరోధక నిబంధనలకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద ఆగస్ట్ 17న కేసు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 15 మంది పేర్లను పేర్కొంది. సిసోడియాతో పాటు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ, అప్పటి డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్, తొమ్మిది మంది వ్యాపారవేత్తలు, రెండు కంపెనీలను సీబీఐ నిందితులుగా పేర్కొంది.

లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కార్యాలయం నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపిన సూచన మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. టెండర్ తర్వాత లైసెన్స్‌దారులకు అనవసరమైన సాయాన్ని అందించే ఉద్దేశంతో సిసోడియాతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులు 2021-22 ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మాజీ సీఈవో విజయ్ నాయర్, పెర్నోడ్ రికార్డ్ మాజీ ఉద్యోగి మనోజ్ రాయ్, బ్రిండ్‌కో స్పిరిట్స్ యజమాని అమన్‌దీప్ ధాల్, ఇండోస్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రూ అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ పేర్కొంది.



కేజ్రీవాల్ ప్రభుత్వ గత ఏడాది నవంబర్‌లో కొత్త అబ్కారీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ విధానంలో విఅవకతవకలు, విధానపరమైన లోపాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. టెండర్ల విధానంలో కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదికలో ఉంది. దీంతో ఈ నివేదికపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే మనీష్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలను ఆది నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందని అంటున్నారు. అయితే దీనిని బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.