లోక్జన్శక్తి పార్టీ ఎంపీ ప్రిన్స్ పాశ్వాన్పై అత్యాచారం కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకే ఆయనపై కేసు నమోదుచేసినట్టు ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. ‘గురువారం అందిన కోర్టు ఆదేశాల మేరకు వివిధ సెక్షన్ల కింద ప్రిన్స్ పాశ్వాన్ కాన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రిన్స్ పాశ్వాన్ బిహార్లోని సమస్తీపుర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, కొద్ది నెలల కిందటే ఎల్జేపీకి చెందిన మహిళా కార్యకర్తపై ఆయనపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్స్ రాజ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు పార్టీలోని మహిళా నేత ఈ ఏడాది జూన్లో చేసిన ఫిర్యాదులో ఆరోపించింది. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించాడని ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల గురించి బాబాయ్ పశుపతి పరాస్కు తెలియజేస్తూ ఈ ఏడాది మార్చి 29 లేఖ రాసినట్టు ఎంపీ చిరాగ్ పాశ్వాన్ జూన్ 17న మీడియాకు విడుదల చేశారు.
‘‘కొద్ది రోజులుగా పార్టీతో సంబంధం ఉన్న ఒక మహిళ ప్రిన్స్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తోంది.. కుటుంబ పెద్ద అయినందున, ఈ విషయంపై నేను మిమ్మల్ని సంప్రదించాను.. కానీ మీరు కూడా ఈ తీవ్రమైన విషయాన్ని విస్మరించారు. విస్మరించిన తరువాత ప్రిన్స్పై నిజానిజాలు బయటకు వచ్చి దోషి ఎవరో తెలుతుందని పోలీసుల వద్దకు వెళ్లమని సలహా ఇచ్చాను’’ అని చిరాగ్ అన్నారు.
ఎల్జేపీలో మూడు నెలల కిందట సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. రాంవిలాస్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ను ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. చిరాగ్తో కలిసి ఆ పార్టీ తరఫున ఆరుగురు లోక్సభ సభ్యులు ఉండగా, అందులో అయిదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారు. చిరాగ్ చిన్నాన్న, ఎంపీ పశుపతి కుమార్ పారస్ను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
‘‘కొద్ది రోజులుగా పార్టీతో సంబంధం ఉన్న ఒక మహిళ ప్రిన్స్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తోంది.. కుటుంబ పెద్ద అయినందున, ఈ విషయంపై నేను మిమ్మల్ని సంప్రదించాను.. కానీ మీరు కూడా ఈ తీవ్రమైన విషయాన్ని విస్మరించారు. విస్మరించిన తరువాత ప్రిన్స్పై నిజానిజాలు బయటకు వచ్చి దోషి ఎవరో తెలుతుందని పోలీసుల వద్దకు వెళ్లమని సలహా ఇచ్చాను’’ అని చిరాగ్ అన్నారు.
ఎల్జేపీలో మూడు నెలల కిందట సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. రాంవిలాస్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ను ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. చిరాగ్తో కలిసి ఆ పార్టీ తరఫున ఆరుగురు లోక్సభ సభ్యులు ఉండగా, అందులో అయిదుగురు ఓ వర్గంగా ఏర్పడ్డారు. చిరాగ్ చిన్నాన్న, ఎంపీ పశుపతి కుమార్ పారస్ను తమ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.