యాప్నగరం

బాబ్రీ కేసులొ అద్వానీకి 100 ప్రశ్నలు.. ఉక్కిరిబిక్కిరి చేసిన కోర్టు

Babri Masjid Demolition Case: బాబ్రీ కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి సీబీఐ స్పెషట్ కోర్టు ప్రశ్నలవర్షం సంధించింది.

Samayam Telugu 25 Jul 2020, 12:10 am
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ కురువృద్ధుడు, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ కేసులో అద్వానీకి 100 ప్రశ్నల వరకు సంధించిందని ఆయన తరఫు లాయర్ తెలిపారు. 1992 బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసుపై సీబీఐ కోర్టు శుక్రవారం (జులై 24) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అద్వానీ వాంగూల్మం నమోదు చేసింది.
Samayam Telugu ఎల్‌కే అద్వానీ
Babri Demolision Case


ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సుమారు నాలుగున్నర గంటల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో న్యాయమూర్తి అద్వానీని 100 ప్రశ్నలు అడిగినట్టు ఆయన తరఫున లాయర్‌ తెలిపారు. అయితే.. ఈ సందర్భంగా తనపై ఉన్న ఆరోపణలను అద్వానీ ఖండించినట్టు తెలిపారు.

ఈ కేసుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే బీజేపీ సీనియర్‌ నాయకుడు మురళీ మనోహర్‌ జోషి వాంగ్మూలం నమోదు చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి ఇదివరకే పేర్కొంది.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసి, తీర్పు వెలువరించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది.

మరోవైపు.. కోర్టు ముందు వాంగ్మూలం వినిపించడానికి రెండు రోజుల ముందు అద్వానీ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య సుమారు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది.

Also Read: వీడియో: ఈ కూరగాయలమ్మ ఆంగ్లానికి అవాక్కవ్వాల్సిందే..!

Must Read: ఆ ఎన్-95 మాస్కులు వాడొద్దు.. కరోనా వైరస్‌ను అడ్డుకోలేవు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.