యాప్నగరం

​ప్రధాని మోడీ గురు దక్షిణ చెల్లించుకోనున్నారా?

బీజేపీ ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? అనేది అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.

TNN 15 Mar 2017, 9:49 am
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన సానుకూల ఫలితాలు భారతీయ జనతా పార్టీ కి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ప్రత్యేకించి యూపీలో సాధించిన సంచలన విజయం బీజేపీకి అనేక రకాలుగా మేలు చేసే అంశంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీకి యూపీ విజయం చాలానే ఉపయుక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? అనేది అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది.
Samayam Telugu lk advani to contest for president post
​ప్రధాని మోడీ గురు దక్షిణ చెల్లించుకోనున్నారా?


ఇప్పటికే కమలం పార్టీ తరపు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో పలువురి సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే.. వాటికంత ప్రాధాన్యత లేదని.. రాష్ట్రపతి అభ్యర్థిత్వం విషయంలో ప్రధాని మోడీ చాలా స్పష్టతతో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారతీయజనతా పార్టీ భీష్ముడు ఎల్ కే అద్వానీని రాష్ట్రపతిగా చేసి మోడీ తన గురుదక్షిణ చెల్లించుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అద్వానీని రాష్ట్రపతిగా చేయాలని మోడీ కృత నిశ్చయంతో ఉన్నాడని, మరెవరికీ అవకాశం లేదని.. బీజేపీ తరపు నుంచి అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఖాయమని తెలుస్తోంది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కు కూడా మోడీ స్పష్టంగానే చెప్పారని.. అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఇక లాంఛనమేనని సమాచారం. 2002లో గుజరాత్ లో చెలరేగిన మతకలహాల సమయంలో మోడీని సీఎం పదవి నుంచి తొలగించాలని ఎన్డీయేలోని పార్టీలు ఒత్తిడి చేయగా.. నాటి ప్రధాని వాజ్ పేయి ఆ ఒత్తిడికి తలొగ్గే పరిస్థితుల్లో.. అద్వానీ మోడీ తరపున నిలబడి పదవి చేజారకుండా నిలబెట్టారనే పేరుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.