యాప్నగరం

లాక్‌డౌన్ నుంచి మరిన్ని సేవలకు మినహాయింపు.. కేంద్రం కీలక నిర్ణయం

బుక్ షాప్‌లు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లను విక్రయించే షాపులు, సిమెంట్ పరిశ్రమలు, రోడ్డు నిర్మాణ పనులు సహా అనేక రంగాలకు కేంద్రం లాక్‌డౌన్ సడలింపులను ఇచ్చింది.

Samayam Telugu 23 Apr 2020, 7:06 pm
ఏప్రిల్ 20న లాక్‌డౌన్ నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. హాట్‌స్పాట్ కాని ప్రాంతాల్లో తాజాగా మరికొన్ని సడలింపులు ఇచ్చింది. లాక్‌డౌన్ విధించి నెల రోజులు అవుతుండటం, వేసవి కావడంతో.. ఈ సడలింపులను తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ ఫ్యాన్లు విక్రయించే షాపులు, బుక్ షాపులకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలీల శ్రీవాస్తవ తెలిపారు. మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మొబైల్‌ రీఛార్జీ షాప్‌లు, బ్రెడ్ ఫ్యాక్టరీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి సడలింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
Samayam Telugu lockdown


రోడ్డు నిర్మాణ పనులు, సిమెంట్‌ పరిశ్రమలకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్రం షరతు విధించింది. గత 28 రోజులు లేదా అంత కంటే ఎక్కువ రోజుల్లో 12 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపింది.

మార్చి 24న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం దాన్ని మే 3 వరకు పొడిగించారు. కాగా తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేసీఆర్ సర్కారు.. వ్యవసాయ కార్యకలాపాలకు మినహా మిగతా రంగాలకు ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.