యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: బెంగళూరులో లాక్‌డౌన్.. కర్ణాటక సర్కారు కీలక నిర్ణయాలు

బెంగళూరులో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం నగరంలో పూర్తిగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది.

Samayam Telugu 4 Jul 2020, 5:39 pm
కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో లాక్‌డౌన్ విధించింది. నేటి రాత్రి (శనివారం) 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలో లాక్‌డౌన్ అమలు కానుంది. సీఎం బీఎస్ యడియూరప్ప సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీబీఎంపీ కమిషనర్ అనిల్ కుమార్ ప్రకటించారు. లాక్‌డౌన్ సమయంలో మటన్ షాపులు, పండ్ల దుకాణాలు, మెడికల్ షాపులు తెరచి ఉంటాయి, నిత్యవసరాలను విక్రయిస్తారు.
Samayam Telugu bangalore


అనవసరం రోడ్ల మీదకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఆగష్టు 2 వరకు ప్రతి ఆదివారం బెంగళూరు నగరంలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని సీఎం యడియూరప్ప ప్రకటించారు. పోలీసులకు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

కరోనా కట్టడి కోసం కర్ణాటక సర్కారు తీసుకుంటున్న అనేక చర్యల్లో లాక్‌డౌన్ ఒకటి. కరోనా పరిస్థితులను తెలుసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కర్ణాటక కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది. బెంగళూరులోనే 8800 బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

కరోనా లక్షణాలు లేని వారు హోం ఐసోలేషన్2లో ఉండటం కోసం మార్గదర్శకాలను కూడా టాస్క్‌ఫోర్స్ విడుదల చేసింది. 50 ఏళ్లు పైబడిన పేషెంట్లకు హోం ఐసోలేషన్‌ను 14 రోజుల నుంచి 17 రోజులకు పెంచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.