యాప్నగరం

లోక్‌సభ రేపటికి వాయిదా

నాలుగు రోజుల తర్వాత సమావేశమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ లేకుండా అదే రచ్చ కొనసాగుతోంది.

TNN 14 Dec 2016, 12:31 pm
నాలుగు రోజుల తర్వాత సమావేశమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ లేకుండా అదే రచ్చ కొనసాగుతోంది. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని స్పందించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ లోక్ సభ, రాజ్యసభలో నినాదాలు చేశారు. లోక్ సభ ప్రారంభమైన కొద్ది సేపటికే పెద్దనోట్లపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను 12గంటలకు వాయిదా వేశారు.
Samayam Telugu lok sabha adjourned till tommorow
లోక్‌సభ రేపటికి వాయిదా


తిరిగి 12గంటలకు సమావేశమైన లోక్ సభలో...కేంద్ర హోం సహాయ మంత్రి కిరణ్ రిజిజుపై విద్యుత్ ప్లాంటులో నెలకొన్ని కుంభకోణంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
మోదీ ప్రభుత్వ తీరుపై సభలో చర్చిస్తానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటు వెలుపల మీడియాతో చెప్పారు.

బుధవారం సభలో మోదీ పెద్దనోట్లపై మాట్లాడతారని ఆశించినా..ఏం మాట్లాడలేదు. సభలో కూర్చున్న మోదీ...ప్రతిపక్షసభ్యులు ఆందోళన చేసే సమయంలో మౌనంగానే అంతా గమనించారు.

కిరణ్ రిజిజుపై వచ్చిన ఆరోపణలపై తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.
ప్రతిపక్ష సభ్యుల ఆందోళన కొనసాగడంతో స్పీకర్ లోక్ సభను రేపటికి వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.