యాప్నగరం

స్పీకర్‌‌కు కోపం తెప్పించిన ఎంపీల ప్రవర్తన!

పార్లమెంట్‌లో ఎంపీల ప్రవర్తన.. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌‌కు చిరాకు తెప్పించింది.

TNN 22 Mar 2017, 7:24 pm
మొన్న రాజ్యసభలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో.. స‌భ‌లో మంత్రులు లేక‌పోవ‌డంతో రాజ్య‌స‌భ చైర్మ‌న్ హ‌మిద్ అన్సారీ అసహనానికి గురైన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే ఇవాళ లోక్‌సభలోనూ చోటు చేసుకుంది. పార్లమెంట్‌లో ఎంపీల ప్రవర్తన.. లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌‌కు చిరాకు తెప్పించింది. ఈ రోజు ఉదయం సభలో.. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎంపీలంతా ఇష్టమొచ్చినట్లు ఇతర సభ్యులతో మాట్లాడటం మొదలుపెట్టారు. వారి మాటల శబ్దంతో సభ మొత్తం గందరగోళంగా తయారైంది. దీంతో మహాజన్‌.. ‘ఏం జరుగుతోంది ఇక్కడ? ఇదేమైనా స్కూలా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu lok sabha speaker sumitra mahajan unhappy with mps murmuring after question hour
స్పీకర్‌‌కు కోపం తెప్పించిన ఎంపీల ప్రవర్తన!


ప్రశ్నోత్తరాలు ముగియగానే ప్రధాని నరేంద్ర మోడీ సభ నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోగానే సభ్యులంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండటంతో సభలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో స్పీకర్ మహాజన్‌కు సభ కొనసాగించడం కష్టంగా మారింది. ఆమె పలుమార్లు ప్లీజ్‌.. ప్లీజ్‌.. నిశ్శబ్దంగా ఉండండి అంటూ సభ్యులను కోరారు. అయినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆమె కోపంగా.. ‘ఏం జరుగుతోంది ఇక్కడ.. ఇదేమైనా స్కూలా’ అని ప్రశ్నించారు. దీంతో సభ్యులందరూ నిశ్శబ్దం పాటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.