లోక్సభలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ మొదలైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. లోక్సభలో పలు పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడంతో అవి చర్చకు వస్తాయా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఉభయసభల్లోనూ ప్రతి రోజూ వాయిదాల పర్వమే కొనసాగుతోంది.
లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
లోక్సభలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు.
Samayam Telugu 3 Apr 2018, 11:31 am