యాప్నగరం

లోక్‌సభ సోమవారానికి వాయిదా..!

లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ... అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనలు చేపట్టడంతో... స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.

TNN 28 Mar 2018, 1:01 pm
లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ... అన్నాడీఎంకే సభ్యుల ఆందోళనలు చేపట్టడంతో... స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే... కావేరి బోర్డు ఏర్పాటు కోరుతూ... అన్నాడీఎంకే ఎంపీలు సభలో గందరగోళం చేయడంతో మొదట 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో... అన్నాడీఎంకే సభ్యులు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ, న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అవిశ్వాసానికి సంబంధించిన నోటీసులు తనకు అందాయని... సభ ఇలా ఉంటే... అవిశ్వాసంపై చర్చ ఎలా సాగుతుందని స్పీకర్ అన్నారు. నిరసనల మధ్య సభా సమావేశాలు జరిగే పరిస్థితి లేకపోవడంతో లోక్‌సభ సమావేశాలను సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu speakar


వరుస సెలవుల నేపథ్యంలో... సమావేశాలు ఏప్రిల్ 2కు వాయిదా పడ్డాయి. మరోవైపు రాజ్యసభలో... పదవీకాలం ముగిసిన సభ్యులకు రాజ్యసభ వీడ్కోలు పలుకుతుంది. నేటితో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పదవీకాలం కూడా ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.