దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జిని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దానికి భూపేన్ హజారికా పేరును పెట్టారు. అసోంలోని బ్రహ్మాపుత్రానది ఉపనది అయిన లోహిత్ పై దీనిని నిర్మించారు. అరుణ్ చల్ ప్రదేశ్, అసోంలను కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఈ వంతెన వల్ల దేశం ఖ్యాతి పెరగడంతో పాటూ లక్షలాది మందికి ప్రయోజనం కలగనుంది. అయితే రెండు వేల మందికి మాత్రం ఉపాధి లేకుండా చేసింది ఆ వంతెన. బ్రిడ్జి ప్రారంభమైన రోజే వారి సంతోషానికి చివరి రోజైంది.
బ్రిడ్జి లేనప్పుడు బోటు ద్వారా ప్రజలను ఆవలి ఒడ్డుకు చేర్చేవారు. బోటు నిర్వాహకులు, అందులో పనిచేసేవారికి అదే ఆధారం. మొత్తం 150 మంది బోటు నిర్వాహకులు ఉండగా... వారి దగ్గర పనిచేసే పనివాళ్లు కలిపి రెండు వేల మంది పనిలేకుండా అయిపోయారు. వారి ఉపాధి ప్రశ్నార్థకమై... కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. అలాగే నదికి రెండు వైపులా హోటళ్లు కూడా ఉండేవి. వెయ్యి మంది దాకా అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వీరి భవిష్యత్తుపై ముఖ్యమంత్రి స్పందించారు. బోటు నిర్వాహకులకు, వ్యాపారస్థులకు, పని వాళ్లకు ఏదైనా పునరావాసం కల్పించే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
బ్రిడ్జి లేనప్పుడు బోటు ద్వారా ప్రజలను ఆవలి ఒడ్డుకు చేర్చేవారు. బోటు నిర్వాహకులు, అందులో పనిచేసేవారికి అదే ఆధారం. మొత్తం 150 మంది బోటు నిర్వాహకులు ఉండగా... వారి దగ్గర పనిచేసే పనివాళ్లు కలిపి రెండు వేల మంది పనిలేకుండా అయిపోయారు. వారి ఉపాధి ప్రశ్నార్థకమై... కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. అలాగే నదికి రెండు వైపులా హోటళ్లు కూడా ఉండేవి. వెయ్యి మంది దాకా అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వీరి భవిష్యత్తుపై ముఖ్యమంత్రి స్పందించారు. బోటు నిర్వాహకులకు, వ్యాపారస్థులకు, పని వాళ్లకు ఏదైనా పునరావాసం కల్పించే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.