యాప్నగరం

కుటుంబాన్ని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం..

తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు..

TNN 13 May 2017, 2:13 pm
తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు కార్ డ్రైవర్ మరణంచారు. వీరు ప్రయాణిస్తున్న కారును ముంబై నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఒక లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు రెండు వాహనాలు మితిమీరిన వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగంగా వచ్చిన లారీ కిందకి దూసుకెళ్లిన కారు దాని కింద ఇరుక్కుపోయి గుర్తుపట్టలేని విధంగా దెబ్బతింది. ఢీకొట్టిన తర్వాత లారీ ఆ కారును కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లింది.
Samayam Telugu lorry rams into a car and killed 5 persons of a family
కుటుంబాన్ని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం..


కారులో ఇరుక్కుపోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు.. మయూర్ చావ్లా (34), దినాల్ చావ్లా (26), ఆరతి, కాయబ్‌తో పాటు కార్ డ్రైవర్ సునీల్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన మరో చిన్నారి (2) హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పరారైన లారీ డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు.
Read this in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.