యాప్నగరం

సమ్మె: లారీ చక్రాలకు బ్రేకులు

గురువారం నుంచి లారీ చక్రాలకు బ్రేకులు పడ్డాయి.

TNN 30 Mar 2017, 7:53 am
గురువారం నుంచి లారీ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. సమ్మె చేస్తున్నట్టు దక్షిణాది లారీ యజమానుల సంఘం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాస్ట్రాల్లోని 16 లక్షల లారీలు నిలిచిపోయాయి. గురువారం ఉదయం నుంచి సమ్మె ప్రారంభమైంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ప్రభావం పడనుంది. అక్కడి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. కేంద్ర రవాణా శాఖతో సంఘం నాయకులు రెండు రోజుల క్రితం చర్చలు జరిపారు. వారు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు.
Samayam Telugu lorrys strike from today call given by lorry owners associations in south india
సమ్మె: లారీ చక్రాలకు బ్రేకులు


భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించడం, సింగిల్ పర్మిట్ విధానం తీసుకురావాలని, లోడింగ్-అన్ లోడింగ్ ప్రక్రియలో మామూళ్లను తగ్గించాలని ఇలా దాదాపు 13 డిమాండ్లను సంఘం కేంద్రం ముందు ఉంచింది. ప్రభుత్వం వాటిల్లో కొన్నింటికి మాత్రమే హామీ ఇచ్చింది. దీంతో ప్రధాన సమస్యలకు ఎలాంటి హామీ లభించలేదని చెబుతూ లారీ యజమానుల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది.

గురువారం ఉదయం 6గంటల నుంచి లారీలు, డీసీఎంలు, ట్రాలీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కారమయ్యేవరకు లారీలను రోడ్డెక్కనివ్వమని వారు చెప్పారు. ఈ సమ్మెతో ఆంధ్రప్రదేశ్ లో మూడు లక్షల లారీలు, తెలంగాణలో రెండున్నరల లక్షల లారీలు రోడ్డెక్కనున్నాయి. దీంతో పెట్రోలు, డీజిల్, కూరగాయలు ఇలా కొన్ని సరఫరాలపై తీవ్రంగా బంద్ ప్రభావం ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.