యాప్నగరం

Gift to Losing Sarpanch ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి రూ.11 లక్షల నగదు, కారు, భూమి బహుమతిగా ఇచ్చిన గ్రామస్థులు!

Villagers Gift to Losing Sarpanch పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఇలా ఎన్నిక‌లు ఏవైనా కానీ గెలుపు, ఓట‌ముల‌ను చాలామంది ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటారు. కేవలం ఎంపీ, ఎమ్మేల్యే మాత్ర‌మే కాదు వార్డ్‌ మెంబ‌ర్, స‌ర్పంచ్, ఎంపీటీసీ ఎన్నిక‌లకు కూడా గ‌ట్టి పోటీ ఉంటుంది. గెలిచిన‌వాళ్లు సంబ‌రాలు చేసుకుంటే.. ఓడిన‌వాళ్లు నిరాశ‌లో కూరుకుపోతారు. అయితే, ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కూడా ఒక స‌ర్పంచ్ అభ్య‌ర్థి మాత్రం గ్రామస్థులు చేసిన పనితో సంతోషంగా ఉన్నాడు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 28 Nov 2022, 10:39 am

ప్రధానాంశాలు:

  • హరియాణాలో పంచాయతీ ఎన్నికలు
  • పలు గ్రామాల్లో ఆసక్తికర సంఘటనలు
  • ఓడిపోయినవారికి గ్రామస్థులు సన్మానం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Haryana Elections
Villagers Gift to Losing Sarpanch పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన సర్పంచ్ అభ్యర్థికి జాక్‌పాట్ తగిలింది. గ్రామస్థులంతా కలిసి ఆయనకు రూ. 11 లక్షల నగదుతోపాటు ఓ కారు, కొంత భూమి బహుమతిగా అందజేశారు. అరుదైన ఈ సన్నివేశం హరియాణా పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. ఫతేహాబాద్‌లోని నధోడి గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. పంచాయతీలో మొత్తం 5,085 మంది ఓటర్లు ఉండగా.. మొత్తం 4,416 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సుందర్ అనే అభ్యర్థికి 2,200 ఓట్లు, నరేందర్ అనే మరో అభ్యర్థికి 2,201 ఓట్లు వచ్చాయి. దీంతో నరేందర్ చేతిలో ఒక్క ఓటు తేడాతో సుందర్ ఓడిపోయారు.
దీంతో ఓటమి బాధ నుంచి సుందర్‌ను బయటపడేయాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. సుందర్‌కు గ్రామస్థులు ఊహించని విధంగా కానుకలు అందించారు. గ్రామ ప్రజలంతా రూ.11,11,000 నగదు, ఓ స్విఫ్ట్ డిజైర్ కారు, అర ఎకరం భూమిని బహుమతిగా అందజేశారు. అంతేకాదు, ఐదేళ్ల తర్వాత జరిగే పంచాయతీ ఎన్నికల్లో సురేందర్‌ను సర్పంచ్‌గా ఎన్నుకుందామని ప్రకటించారు. గ్రామస్థుల నుంచి తనకు దక్కిన గౌరవం సుందర్ సంతోషం వ్యక్తం చేశాడు. గ్రామ ప్రజల ప్రేమను పొందడమే తనకు అతిపెద్ద విజయమని వ్యాఖ్యానించారు.

పంచాయతీ ఎన్నికలంటే కొట్లాటలు, ఘర్షణలు, గొడవలతో గ్రామస్థులు వర్గాలు విడిపోతారు. అలాంటిది సోదరభావంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి ఓడిపోయిన అభ్యర్థిని సన్మానించిన గ్రామస్థులను అందరూ అభినందిస్తున్నారు. అలాగే, ఫరీదాబాద్ జిల్లాలోని ఫతేపూర్ తాగా గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ను కూడా స్థానికులు ఇలాగే గొప్పగా సన్మానించారు. రూ. 11 లక్షల విలువైన రూ. 500 నోట్లతో గజమాల తయారు చేసి దానితో ఆయనను సన్మానించారు.

రోహ‌త‌క్ జిల్లాలోని చిరి గ్రామంలో ధర్మ‌పాల్ అనే వ్య‌క్తి సర్పంచ్ అభ్య‌ర్థిగా పోటీ చేసి 66 ఓట్ల తేడాతో ఓడిపోగా.. ఆయనకు గ్రామస్థులంతా ఒక ఫంక్ష‌న్ ఏర్పాటు చేశారు. ధ‌ర్మ‌పాల్‌కి త‌ల‌పాగా చుట్టి, మెడ‌లో దండ వేశారు. అంద‌రూ చందాలు వేసి కారు కొనివ్వ‌డ‌మే కాకుండా రూ.2 కోట్ల నగదు కూడా ఇచ్చారు.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.