యాప్నగరం

Odisha Train Crash Site: రైలు పట్టాలపై నలిగిపోయిన ప్రేమ కవితలు.. ఆ దురదృష్టవంతుడెవరో

Odisha Train Crash Site రైలుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తమవారి మృతదేహాల కోసం రెండు రోజులుగా కుటుంబసభ్యులు, బంధువులు తిరగని చోటు, వెతకని ప్రదేశం లేదు. కనిపించిన వాళ్లందరికీ తమవారి ఫోటోలు చూపించి తీస్తూనే ఉన్నారు. ఇది రైలు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాల ఆవేదన. మృతుల ఫొటోలు చూస్తూ.. వాటిలో తన కుమారుడి ఫొటో ఉందా? అంటూ ఆత్రుతగా వెతుకుతూ కనిపించారు. ఇదే సమయంలో మరెన్నో విషాద ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 5 Jun 2023, 9:39 am

ప్రధానాంశాలు:

  • రైలు ప్రమాదంతో కూలిపోయిన కలలు
  • పట్టాలపై బెంగాలీలో రాసిన ప్రేమ కవితలు
  • కాలగర్భంలో కలిసిపోయిన ఆశల సౌధాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Love Poems
ఒడిశా రైలు ప్రమాదం వందలాది మంది కలలను కల్లలు చేసింది. ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో ప్రయాణించిన ఓ వ్యక్తి తన డైరీలో రాసుకున్న ‘ప్రేమ కవితలు’ చెల్లాచెదురైన పట్టాలపై పడున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగాలీలో రాసి ఉన్న ప్రేమ గీతాలు.. ఏనుగులు, చేపల బొమ్మలు ఓ వైపు.. సూర్యుడు మరోవైపు ఉన్న కాగితాలపై పడిన నెత్తుటిధారలు ఎంతోమంది ఆశల సౌధాలు కూలిపోయి.. కాలగర్భంలో కలిపేసిన ఆనవాళ్లుగా మిగిలాయి.
‘చిన్ని చిన్ని మేఘాలు చిరుజల్లులను కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ కుసుమాలు విరబూస్తాయి’ అని బెంగాలీలో చేతిరాతతో రాసి ఉంది. ‘అన్నివేళలా నీ ప్రేమ కావాలి.. ఎల్లప్పుడూ నువ్వు నా మదిలోనే ఉంటావు’ అని అసంపూర్తిగా రాసి ఉన్న ప్రేమ కవితలు పదే పదే రోదిస్తున్నట్టు రెపరెపలాడుతున్నాయి. అయితే, ఈ డైరీ ఎవరిది?.. ఆ వ్యక్తి ఎవరు? అతడి పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు. ఇప్పటి వరకూ ఆ డెయిరీ గురించి ఎవరూ అధికారులను సంప్రదించలేదు.

మరోవైపు, ప్రమాద బాధితుల్లో 100 మందికి తీవ్ర గాయాలయ్యాయనీ, వారికి శస్త్రచికిత్సలు అవసరం ఉందని నిర్ధారించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌, రాంమనోహర్‌ లోహియా ఆసుపత్రుల నుంచి వైద్య బృందాలను వాయుసేన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు కేంద్రం పంపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఆదివారం భువనేశ్వర్‌‌కు చేరుకుని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు.

మరోవైపు, బహానగ బజార్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ప్రమాదం కాదని, సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. దీనిలో కుట్ర కోణం ఉండొచ్చని పరోక్షంగా స్పష్టం చేశారు. పాయింట్‌ మెషిన్‌ సెట్టింగ్‌లు ఎవరో మార్చివేశారని అనుమానించారు. అయితే వారిని ఇప్పటికే గుర్తించామని త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని, సీబీఐ విచారణకు సిఫారసు చేశామని ఆయన వెల్లడించారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.