యాప్నగరం

పేదలకు సాయం.. ట్రాఫిక్ ఏఎస్సై పెద్ద మనసు

పేదలకు సాయం చేస్తున్న ట్రాఫిక్ ఏఎస్సై.. ఏడాదిగా సేవా కార్యక్రమాలు. తాజాగా పేదలకు చెప్పులు పంపిణీ చేసిన అశోక్‌కుమార్. ఏఎస్సైపై ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు.

Samayam Telugu 7 Sep 2019, 9:19 pm
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. అవును పొరుగువాడికి సాయపడే మనస్తత్వం ఈ ప్రపంచంలో చాలా గొప్పది. సరిగ్గా ఇలాగే పంజాబ్‌లోనూ ఓ ట్రాఫిక్ ఏఎస్సై పేదలకు సాయం చేస్తూ తన పెద్ద మనసు చాటుకుంటున్నారు. తనకొచ్చే అరకొర జీతంలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
Samayam Telugu punjab


లుధియానాలో ట్రాఫిక్ ఏఎస్సై అశోక్‌కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న సమయంలో పేదవాళ్ల కష్టాలు చూసి చలించిపోయన ఆయన.. వారికి ఏదో ఓ సాయం చేయాలనుకున్నారు. అప్పటి నుంచి తనకు తోచిన విధంగా అండగా నిలుస్తున్నారు. తాజాగా రోడ్డు పక్కన నివసించే పేదవాళ్లకు చెప్పులు పంపిణీ చేశారు.

తాను విధులునిర్వహిస్తున్న సమయంలో రోడ్డుపైన కొందరు చెప్పులు లేకుండా నడవటం చూశానని.. అది తనను ఎంతో బాధించిందన్నారు. అందుకే వారికి చెప్పులు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనుకున్నదే తడవుగా చెప్పులు పంపిణీ చేశారు. దాదాపు ఏడాది అశోక్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.