యాప్నగరం

కావేరి ఆస్పత్రిలో కరుణానిధి.. హెల్త్ బులిటెన్ విడుదల

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. కరుణకు బీపీ పడిపోవడంతో అర్థరాత్రి 1.30 నిమిషాల సమయంలో చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు సీనియర్ డాక్టర్లు పర్యవేక్షణలో.. ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేర్చిన గంట తర్వాత హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు.

Samayam Telugu 28 Jul 2018, 7:40 am
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. కరుణకు బీపీ పడిపోవడంతో అర్థరాత్రి 1.30 నిమిషాల సమయంలో చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు సీనియర్ డాక్టర్లు పర్యవేక్షణలో.. ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేర్చిన గంట తర్వాత హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. కరుణకు బీపీ పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్చారని.. ఆయనకు వైద్యానికి స్పందిస్తున్నారని.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు.
Samayam Telugu Karuna


మరోవైపు కరుణను ఆస్పత్రికి తరలించారని సమాచారం తెలుసుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారు ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అక్కడ తోపులాట జరగడంతో.. పోలీసులు కార్యకర్తల్ని చెదరగొట్టారు. దీంతో డీఎంకే నేత ఎ. రాజా స్పందించారు. కరుణానిధి వైద్యానికి స్పందిస్తున్నారని.. రక్తపోటు మామూలు స్థాయికి వచ్చిందన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు కరుణానిధిని పరామర్శించనున్నారు. కావేరీ ఆస్పత్రికి వెళ్లనున్న వెంకయ్య.. కరుణను పరామర్శించి.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీయనున్నారు. ఇటు ప్రధాని మోదీతో పాటూ రాష్ట్రపతి కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటూ మరికొందరు జాతీయస్థాయి నేతలు స్టాలిన్‌కు ఫోన్ చేసి కరుణ ఆరోగ్యంపై ఆరా తీశారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.